ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన చైర్మన్ పావని రమేష్ గౌడ్
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు.చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో గురువారం రాపర్తి సైదులు గౌడ్ – మంజుల దంపతుల ఇందిరమ్మ ఇంటిని చైర్మన్ పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ దేప రమ్య తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కల నెరవేర్చాలని దృఢ సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్లను దశల వారీగా మంజూరు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి దశల వారీగా ఇండ్లు అందజేస్తామని తెలిపారు.అనంతరం రాపర్తి సైదులు గౌడ్ – మంజుల దంపతులు చైర్మన్ పావని రమేష్ గౌడ్, కౌన్సిలర్ దేప రమ్యలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో షాదీఖానా చైర్మన్ షేక్ కరీం, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు కోలాన్ వినోద, నాయకులు దేప రమ్య రాజు, పదో వార్డు అధ్యక్షుడు పోలోజు శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షుడు కానుగు మధు, రాపర్తి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి