Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:05 PM

కీసరలో చైనా మాంజా కలకలం.. బైక్ నడుపుతున్న వ్యక్తి మెడకు తీవ్ర గాయం, 19 కుట్లు!

కీసరలో చైనా మాంజా కలకలం.. బైక్ నడుపుతున్న వ్యక్తి మెడకు తీవ్ర గాయం, 19 కుట్లు!

కీసరలో చైనా మాంజా కలకలం.. బైక్ నడుపుతున్న వ్యక్తి మెడకు తీవ్ర గాయం, 19 కుట్లు!
December 27, 2025 09:46 PM 593 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కీసర (మేడ్చల్ జిల్లా), స్థానీకం న్యూస్:

సంక్రాంతి పండగ వేళ నిషేధిత చైనా మాంజా (ప్లాస్టిక్ మాంజా) మరోసారి పడగవిప్పింది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గాలిపటం మాంజా చుట్టుకొని ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని మెడ భాగంలో లోతైన గాయం కావడంతో వైద్యులు ఏకంగా 19 కుట్లు వేశారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాధితుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా గాలిపటం ఎగురవేసే దారం (మాంజా) మెడకు చుట్టుకుంది. వాహనం కదులుతున్న వేగంలో ఉండటం, ఆ మాంజా అత్యంత పదునుగా (చైనా మాంజా) ఉండటంతో క్షణాల్లోనే అతని మెడపై తీవ్రమైన కోత పడింది.

వెంటనే స్పందించిన స్థానికులు, రక్తస్రావం అవుతున్న బాధితుడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడిని పరీక్షించిన వైద్యులు గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తక్షణమే చికిత్స అందించి, 19 కుట్లు వేశారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నాడు.

సంక్రాంతి పర్వదినం సమీపిస్తుండటంతో ఆకాశంలో గాలిపటాల సందడి పెరిగింది. ఇదే అదనుగా నిషేధిత ప్లాస్టిక్, గాజు పొడి అద్దిన చైనా మాంజా విక్రయాలు, వినియోగం యథేచ్ఛగా సాగుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఈ మాంజా మనుషులకే కాకుండా పక్షుల ప్రాణాలకు కూడా ముప్పుగా పరిణమిస్తోంది. వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు రానున్న రోజుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మెడకు స్కార్ఫ్ వంటివి ధరించాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News