Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:00 AM

కీసరలో చైనా మాంజా కలకలం.. బైక్ నడుపుతున్న వ్యక్తి మెడకు తీవ్ర గాయం, 19 కుట్లు!

కీసరలో చైనా మాంజా కలకలం.. బైక్ నడుపుతున్న వ్యక్తి మెడకు తీవ్ర గాయం, 19 కుట్లు!

కీసరలో చైనా మాంజా కలకలం.. బైక్ నడుపుతున్న వ్యక్తి మెడకు తీవ్ర గాయం, 19 కుట్లు!
December 27, 2025 09:46 PM 598 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కీసర (మేడ్చల్ జిల్లా), స్థానీకం న్యూస్:

సంక్రాంతి పండగ వేళ నిషేధిత చైనా మాంజా (ప్లాస్టిక్ మాంజా) మరోసారి పడగవిప్పింది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గాలిపటం మాంజా చుట్టుకొని ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని మెడ భాగంలో లోతైన గాయం కావడంతో వైద్యులు ఏకంగా 19 కుట్లు వేశారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాధితుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా గాలిపటం ఎగురవేసే దారం (మాంజా) మెడకు చుట్టుకుంది. వాహనం కదులుతున్న వేగంలో ఉండటం, ఆ మాంజా అత్యంత పదునుగా (చైనా మాంజా) ఉండటంతో క్షణాల్లోనే అతని మెడపై తీవ్రమైన కోత పడింది.

వెంటనే స్పందించిన స్థానికులు, రక్తస్రావం అవుతున్న బాధితుడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడిని పరీక్షించిన వైద్యులు గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తక్షణమే చికిత్స అందించి, 19 కుట్లు వేశారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నాడు.

సంక్రాంతి పర్వదినం సమీపిస్తుండటంతో ఆకాశంలో గాలిపటాల సందడి పెరిగింది. ఇదే అదనుగా నిషేధిత ప్లాస్టిక్, గాజు పొడి అద్దిన చైనా మాంజా విక్రయాలు, వినియోగం యథేచ్ఛగా సాగుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఈ మాంజా మనుషులకే కాకుండా పక్షుల ప్రాణాలకు కూడా ముప్పుగా పరిణమిస్తోంది. వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు రానున్న రోజుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మెడకు స్కార్ఫ్ వంటివి ధరించాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News