Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:12 AM

జూలైలోనే పీఎం కిసాన్ 23వ విడత?.. రైతులకు ఎదురుచూపులు!

జూలైలోనే పీఎం కిసాన్ 23వ విడత?.. రైతులకు ఎదురుచూపులు!

జూలైలోనే పీఎం కిసాన్ 23వ విడత?.. రైతులకు ఎదురుచూపులు!
April 21, 2026 05:09 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద వచ్చే తదుపరి రూ.2,000 విడత త్వరలోనే రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000ను మూడు విడతలుగా నేరుగా డీబీటీ ద్వారా కేంద్రం అందిస్తోంది. ఇప్పటికే పలువురు రైతులు గత విడతల ప్రయోజనం పొందగా, ఇప్పుడు 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా అంచనాల ప్రకారం, ఈ 23వ విడత నిధులు జూలై నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఖచ్చితమైన తేదీపై కేంద్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

ఇక, ఈ సాయం పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి డబ్బులు జమ కావు.

రైతులకు ఆర్థికంగా ఊరటనిచ్చే ఈ పథకం తదుపరి విడత ఎప్పుడు వస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News