Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:27 PM

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ దిశగా అడుగులు.. తెరపైకి 'పీవీ జిల్లా' ప్రతిపాదన!

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ దిశగా అడుగులు.. తెరపైకి 'పీవీ జిల్లా' ప్రతిపాదన!

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ దిశగా అడుగులు.. తెరపైకి 'పీవీ జిల్లా' ప్రతిపాదన!
January 09, 2026 11:59 AM 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nagole
Chanikya Madhu

అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటనతో మొదలైన చర్చ

హుజూరాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై ఆశలు

రాజన్న సిరిసిల్ల, హుస్నాబాద్‌ విలీనంపై జోరుగా ఊహాగానాలు

స్టేట్ బ్యూరో, స్థానికం న్యూస్:

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ (Reorganization) అంశం మరోసారి రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. పరిపాలనా సౌలభ్యం పేరుతో జిల్లాల సరిహద్దులను మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన.. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసింది.

మళ్ళీ తెరపైకి 'పీవీ జిల్లా' డిమాండ్

ప్రధానంగా హుజూరాబాద్ కేంద్రంగా.. దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు పేరిట 'పీవీ జిల్లా'ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తాజా పరిణామాలతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు లేదా ఉన్నవాటిని సరిచేసే క్రమంలో హుజూరాబాద్‌కు జిల్లా హోదా దక్కుతుందనే ఆశాభావం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

చిన్న జిల్లాల మనుగడపై సందిగ్ధం?

మరోవైపు, రాష్ట్రంలోని అతి చిన్న జిల్లాలను రద్దు చేసి, వాటిని పక్కన ఉన్న పెద్ద జిల్లాల్లో విలీనం చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ కోణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా భవిష్యత్తుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిరిసిల్ల జిల్లాను రద్దు చేసి, తిరిగి కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కలుపుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పక్షాలు, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర స్థాయి చర్చ జరుగుతోంది.

హుస్నాబాద్ బాధ్యత మంత్రి పొన్నంపైనే..

ఇక భౌగోళికంగా, పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హుస్నాబాద్ నియోజకవర్గం అంశం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న హుస్నాబాద్‌ను.. తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. స్థానికంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో, ఈ మార్పులపై ఆయన నిర్ణయం కీలకం కానుంది.

ఏది ఏమైనా, మంత్రి పొంగులేటి ప్రకటనతో జిల్లాల స్వరూపం మారనుందన్న సంకేతాలు వెలువడటంతో.. అటు ప్రజల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News