జాతీయ సమైక్యతా శిబిరానికి రామన్నపేట విద్యార్థి
జాతీయ సమైక్యతా శిబిరానికి రామన్నపేట విద్యార్థి
స్థానికం బృందం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం వాలంటీర్ సాయి తేజ ఎంపిక
ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటకు చెందిన జాతీయ సేవా పథకం వాలంటీర్ నోముల సాయి తేజ జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపికయ్యాడు. కళాశాలలో బిఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాయి తేజ, ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఏడు రోజుల పాటు బీహార్ రాష్ట్రంలోని సస్రాంలో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా శిబిరంలో పాల్గొననున్నాడు.జాతీయ సేవా పథకం వాలంటీర్ల నైపుణ్యాలు, సాంస్కృతిక ప్రతిభను పెంపొందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. సస్రాంలోని శాంతి ప్రసాద్ జైన్ కళాశాలలో జరిగే ఈ శిబిరానికి వాలంటీర్ల ఎంపిక ప్రక్రియలో సాయి తేజ సాంస్కృతిక అంశాల్లో ప్రతిభ కనబర్చి ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రహత్ ఖానం, ఉప ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, విద్యా సమన్వయకర్త డాక్టర్ జే. చిన్నబాబు, జాతీయ సేవా పథకం యూనిట్ ఒకటి కార్యక్రమ అధికారి తాటిశెట్టి శ్రీనివాసులు తదితర అధ్యాపక సిబ్బంది సాయి తేజను అభినందించారు. ఈ ఎంపికతో కళాశాలకు మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి