ఈ నెల 9వ తేదీ నుంచి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు అర్హత కలిగిన జర్నలిస్టులు నిర్ణీత సమయంలో నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలతో తమ దరఖాస్తులను సమర్పించాలని ఆమె సూచించారు.
అక్రిడిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా నిర్వహించబడుతుందని, జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల వృత్తిపరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి