జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తులు ఆహ్వానం.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తులు ఆహ్వానం.
స్థానికం బృందం
ఈ నెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ
2026–28 కాలానికి కొత్త కార్డుల జారీ
సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరాల కాలానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 28వ తేదీతో ముగియనున్నందున అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపిన జాబితాలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
జిల్లా స్థాయిలో దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి