Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:31 AM

జనన–మరణాల నమోదు పై కట్టుదిట్టమైన నిబంధనలు

జనన–మరణాల నమోదు పై కట్టుదిట్టమైన నిబంధనలు

జనన–మరణాల నమోదు పై కట్టుదిట్టమైన నిబంధనలు
19-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

21 రోజుల్లో నమోదు చేయకపోతే అపరాధ రుసుము

ఆలస్యంగా నమోదు చేస్తే జరిమానా… ప్రభుత్వం కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనన, మరణాల నమోదుకు సంబంధించిన కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతి జననం, మరణం నిర్దిష్ట కాలవ్యవధిలో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నమోదు ప్రక్రియను కచ్చితంగా అమలు చేసి గణాంకాల ఖచ్చితత్వం పెంచడం, ప్రజలకు సేవలు వేగంగా అందించడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చారు.

కొత్త నిబంధనల ప్రకారం పుట్టిన లేదా మరణించిన తేదీ నుంచి 21 రోజుల్లోపు నమోదు చేయడం తప్పనిసరి. ఈ గడువులో నమోదు చేయకపోతే ఆలస్యంగా నమోదు చేసుకునే వారికి అపరాధ రుసుములు విధించబడతాయి.

21 నుంచి 30 రోజుల మధ్య నమోదు చేస్తే రూ.25 అపరాధ రుసుము చెల్లించాలి.

30 రోజుల తర్వాత నుంచి ఒక సంవత్సరం లోపు నమోదు చేస్తే రూ.250 అపరాధ రుసుము విధించబడుతుంది.

అలాగే పుట్టిన శిశువుకు పేరు వెంటనే నమోదు చేయని సందర్భంలో తల్లిదండ్రులకు సడలింపు కల్పించారు. శిశువు పేరు 12 నెలల లోపు ఎప్పుడైనా ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ నిబంధనలపై గ్రామ, పట్టణ స్థాయి సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. జనన–మరణాల నమోదును నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పూర్తి చేయాలని ప్రజలను కోరుతున్నారు.


Sthanikam

జనన–మరణాల నమోదు పై కట్టుదిట్టమైన నిబంధనలు

Article Image

21 రోజుల్లో నమోదు చేయకపోతే అపరాధ రుసుము

ఆలస్యంగా నమోదు చేస్తే జరిమానా… ప్రభుత్వం కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనన, మరణాల నమోదుకు సంబంధించిన కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతి జననం, మరణం నిర్దిష్ట కాలవ్యవధిలో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నమోదు ప్రక్రియను కచ్చితంగా అమలు చేసి గణాంకాల ఖచ్చితత్వం పెంచడం, ప్రజలకు సేవలు వేగంగా అందించడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చారు.

కొత్త నిబంధనల ప్రకారం పుట్టిన లేదా మరణించిన తేదీ నుంచి 21 రోజుల్లోపు నమోదు చేయడం తప్పనిసరి. ఈ గడువులో నమోదు చేయకపోతే ఆలస్యంగా నమోదు చేసుకునే వారికి అపరాధ రుసుములు విధించబడతాయి.

21 నుంచి 30 రోజుల మధ్య నమోదు చేస్తే రూ.25 అపరాధ రుసుము చెల్లించాలి.

30 రోజుల తర్వాత నుంచి ఒక సంవత్సరం లోపు నమోదు చేస్తే రూ.250 అపరాధ రుసుము విధించబడుతుంది.

అలాగే పుట్టిన శిశువుకు పేరు వెంటనే నమోదు చేయని సందర్భంలో తల్లిదండ్రులకు సడలింపు కల్పించారు. శిశువు పేరు 12 నెలల లోపు ఎప్పుడైనా ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ నిబంధనలపై గ్రామ, పట్టణ స్థాయి సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. జనన–మరణాల నమోదును నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పూర్తి చేయాలని ప్రజలను కోరుతున్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News