Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:02 AM

జనన–మరణాల నమోదు పై కట్టుదిట్టమైన నిబంధనలు

జనన–మరణాల నమోదు పై కట్టుదిట్టమైన నిబంధనలు

జనన–మరణాల నమోదు పై కట్టుదిట్టమైన నిబంధనలు
February 19, 2026 06:15 AM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

21 రోజుల్లో నమోదు చేయకపోతే అపరాధ రుసుము

ఆలస్యంగా నమోదు చేస్తే జరిమానా… ప్రభుత్వం కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనన, మరణాల నమోదుకు సంబంధించిన కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతి జననం, మరణం నిర్దిష్ట కాలవ్యవధిలో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నమోదు ప్రక్రియను కచ్చితంగా అమలు చేసి గణాంకాల ఖచ్చితత్వం పెంచడం, ప్రజలకు సేవలు వేగంగా అందించడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చారు.

కొత్త నిబంధనల ప్రకారం పుట్టిన లేదా మరణించిన తేదీ నుంచి 21 రోజుల్లోపు నమోదు చేయడం తప్పనిసరి. ఈ గడువులో నమోదు చేయకపోతే ఆలస్యంగా నమోదు చేసుకునే వారికి అపరాధ రుసుములు విధించబడతాయి.

21 నుంచి 30 రోజుల మధ్య నమోదు చేస్తే రూ.25 అపరాధ రుసుము చెల్లించాలి.

30 రోజుల తర్వాత నుంచి ఒక సంవత్సరం లోపు నమోదు చేస్తే రూ.250 అపరాధ రుసుము విధించబడుతుంది.

అలాగే పుట్టిన శిశువుకు పేరు వెంటనే నమోదు చేయని సందర్భంలో తల్లిదండ్రులకు సడలింపు కల్పించారు. శిశువు పేరు 12 నెలల లోపు ఎప్పుడైనా ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ నిబంధనలపై గ్రామ, పట్టణ స్థాయి సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. జనన–మరణాల నమోదును నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పూర్తి చేయాలని ప్రజలను కోరుతున్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News