జనన–మరణాల నమోదు పై కట్టుదిట్టమైన నిబంధనలు
జనన–మరణాల నమోదు పై కట్టుదిట్టమైన నిబంధనలు
GADDAM JAGANMOHAN REDDY
21 రోజుల్లో నమోదు చేయకపోతే అపరాధ రుసుము
ఆలస్యంగా నమోదు చేస్తే జరిమానా… ప్రభుత్వం కఠిన నిబంధనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనన, మరణాల నమోదుకు సంబంధించిన కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతి జననం, మరణం నిర్దిష్ట కాలవ్యవధిలో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నమోదు ప్రక్రియను కచ్చితంగా అమలు చేసి గణాంకాల ఖచ్చితత్వం పెంచడం, ప్రజలకు సేవలు వేగంగా అందించడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చారు.
కొత్త నిబంధనల ప్రకారం పుట్టిన లేదా మరణించిన తేదీ నుంచి 21 రోజుల్లోపు నమోదు చేయడం తప్పనిసరి. ఈ గడువులో నమోదు చేయకపోతే ఆలస్యంగా నమోదు చేసుకునే వారికి అపరాధ రుసుములు విధించబడతాయి.
21 నుంచి 30 రోజుల మధ్య నమోదు చేస్తే రూ.25 అపరాధ రుసుము చెల్లించాలి.
30 రోజుల తర్వాత నుంచి ఒక సంవత్సరం లోపు నమోదు చేస్తే రూ.250 అపరాధ రుసుము విధించబడుతుంది.
అలాగే పుట్టిన శిశువుకు పేరు వెంటనే నమోదు చేయని సందర్భంలో తల్లిదండ్రులకు సడలింపు కల్పించారు. శిశువు పేరు 12 నెలల లోపు ఎప్పుడైనా ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ నిబంధనలపై గ్రామ, పట్టణ స్థాయి సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. జనన–మరణాల నమోదును నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పూర్తి చేయాలని ప్రజలను కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి