Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతకు గ్రామం ముందడుగు – హెల్మెట్ లేకుంటే ప్రవేశం లేదు.నిర్నెముల కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 06:50 AM

జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
January 09, 2026 11:33 AM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సూర్యాపేట మండలం పిల్లలమర్రి పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదామును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లు, ఈ–పాస్ యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన ఆయన, ఇప్పటివరకు పిల్లలమర్రి పీఏసీఎస్ ద్వారా 290.43 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామని, ప్రస్తుతం 11.90 మెట్రిక్ టన్నులు (266 బస్తాలు) యూరియా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు.ఈ యాసంగి సీజన్‌కు మరో 100 మెట్రిక్ టన్నుల యూరియా సరిపోతుందని, శుక్రవారం సాయంత్రం నాటికి మరో రెండు లారీల యూరియా లోడ్లు రానున్నాయని ఏడీఏ కలెక్టర్‌కు వివరించగా, అవసరమైనంత యూరియా సరఫరా చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

అనంతరం అక్కడున్న రైతులతో మాట్లాడిన కలెక్టర్, ఎరువుల సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక ఎకరం వరి సాగుకు సుమారు రూ.25 వేల వరకు ఖర్చవుతుందని, సగటున రూ.33 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాంప్రదాయ పంటలైన వరి సాగుతో పాటు అధిక లాభాలు వచ్చే పామాయిల్, కూరగాయల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఓ ప్రవీణ్ కుమార్, తహసిల్దార్ కృష్ణయ్య, ఏడీఏ జ్ఞానేశ్వరి దేవి, ఏఏవో కృష్ణ సందీప్, ఏఈఓ

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News