జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సూర్యాపేట మండలం పిల్లలమర్రి పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదామును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లు, ఈ–పాస్ యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన ఆయన, ఇప్పటివరకు పిల్లలమర్రి పీఏసీఎస్ ద్వారా 290.43 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామని, ప్రస్తుతం 11.90 మెట్రిక్ టన్నులు (266 బస్తాలు) యూరియా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు.ఈ యాసంగి సీజన్కు మరో 100 మెట్రిక్ టన్నుల యూరియా సరిపోతుందని, శుక్రవారం సాయంత్రం నాటికి మరో రెండు లారీల యూరియా లోడ్లు రానున్నాయని ఏడీఏ కలెక్టర్కు వివరించగా, అవసరమైనంత యూరియా సరఫరా చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అనంతరం అక్కడున్న రైతులతో మాట్లాడిన కలెక్టర్, ఎరువుల సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక ఎకరం వరి సాగుకు సుమారు రూ.25 వేల వరకు ఖర్చవుతుందని, సగటున రూ.33 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాంప్రదాయ పంటలైన వరి సాగుతో పాటు అధిక లాభాలు వచ్చే పామాయిల్, కూరగాయల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఓ ప్రవీణ్ కుమార్, తహసిల్దార్ కృష్ణయ్య, ఏడీఏ జ్ఞానేశ్వరి దేవి, ఏఏవో కృష్ణ సందీప్, ఏఈఓ
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి