జాగృతి కళాశాలలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబురాలు
జాగృతి కళాశాలలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబురాలు
Editor Desk
స్థానిక జాగృతి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈ రోజు సంక్రాంతి సంబరాలను అంగ రంగ వైభవం గా నిర్వహించారు. జాగృతి కళాశాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా రంగవల్లుల పోటీలు, మెహందీ ఆర్ట్, భోగి మంటలు మరియు గాలి పటాలను ఎగురవేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ వస్త్ర అలంకరణాలతో కనుల విందు చేసారు.రంగవల్లుల పోటీలో పాల్గొన్న విద్యార్థునులకు కళాశాల డైరెక్టర్ K. నాగేందర్ గారు బహుమతులను ప్రదానం చేసారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భోగి మంటలను ప్రిన్సిపాల్ S. మల్లేశం గారు, వైస్ ప్రిన్సిపాల్ ఏ. మణిపాల్ రెడ్డి గారు ప్రారంభించారు.
డీజే పాటలకు విద్యార్థులు నృత్యాలు చేస్తూ హోరేతిచ్చారు. మెహెంది ఆర్ట్ ను కూడా విద్యార్థులు చూడ ముచ్చటగా ప్రదర్శించారు.
విద్యార్థులు గాలి పటాలతో సందడి చేసారు.
ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎస్ మల్లేశం, డైరెక్టర్ నాగేందర్రావు, వైస్ ప్రిన్సిపాల్ ఏ.మణిపాల్ రెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ Ch. నవీన్, అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి