జడ్పీ ఎన్నికలకు కొత్త జిల్లాలే ప్రాతిపదిక స్థానిక ఎన్నికల ముందే జిల్లా పరిషత్ల విభజన
జడ్పీ ఎన్నికలకు కొత్త జిల్లాలే ప్రాతిపదిక స్థానిక ఎన్నికల ముందే జిల్లా పరిషత్ల విభజన
GADDAM JAGANMOHAN REDDY
అమరావతి: రాష్ట్రంలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లా పరిషత్ (జడ్పీ) ఎన్నికలను కొత్త జిల్లాల ప్రాతిపదికన నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
గురువారం శాసనసభలో మాట్లాడిన ఆయన, పంచాయతీల పునర్విభజనపై ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి రహదారుల విస్తరణతో పాటు ఇతర మౌలిక వసతుల పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ పనులలో భాగంగా చెట్లను తొలగించాల్సి వచ్చినప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా చెట్ల నాటకం చేపట్టే అంశంపై ప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు.
స్థానిక సంస్థల బలోపేతం, గ్రామీణాభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి