బీబీనగర్ స్థానికంఉషా కిరణ్
బీబీనగర్ మండలంలోని జైనపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన పొట్ట లింగయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జైనపల్లి కాంగ్రెస్ నాయకుడు అరుముల్లా రాజు ముధిరాజ్ మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
ఆకస్మిక మరణంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలవడం మానవతా బాధ్యత అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. అవసర సమయంలో ప్రజలకు తోడుగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆరుముళ్ల రమేష్, ఆరుముళ్ల అంజయ్య, నక్కీర్త గండయ్య, సల్ల సీతమ్మ, పొట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి