నకిరేకల్లో మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పూలే వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంస్కర్తగా, సమానత్వ సమాజం కోసం కృషి చేసిన మహానుభావుడిగా కొనియాడారు. దళిత, బహుజనుల అభ్యున్నతికి ఆయన చేసినసేవలుస్ఫూర్తిదాయకమన్నారు. సావిత్రి బాయి పూలేకు విద్య అందించి స్త్రీ విద్యకు బాటలు వేసిన ఘనత ఆయనదేనని తెలిపారు.
పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి