Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

లక్ష్య సాధనకు పట్టుదల అవసరం

లక్ష్య సాధనకు పట్టుదల అవసరం

లక్ష్య సాధనకు పట్టుదల అవసరం
11-04-2026 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

గెస్ట్ లెక్చర్‌లో ప్రముఖ న్యాయవాది చెరుకు శివకుమార్ గౌడ్

విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఈఏపీసెట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించవచ్చని ప్రముఖ న్యాయవాది, మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులకు ఆయన శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. పరీక్షల్లో గరిష్ట మార్కులు సాధించడానికి అనుసరించాల్సిన మెళకువలను వివరించారు. సమయపాలన పాటిస్తూ, క్లిష్టమైన అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం రత్నం ఫౌండేషన్ వారు ఉచితంగా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని, ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణ శిబిరాన్ని సందర్శించిన శివకుమార్ గౌడ్‌ను రత్నం ఫౌండేషన్ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. సామాజిక స్పృహతో ఆయన అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

లక్ష్య సాధనకు పట్టుదల అవసరం

Article Image

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

గెస్ట్ లెక్చర్‌లో ప్రముఖ న్యాయవాది చెరుకు శివకుమార్ గౌడ్

విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఈఏపీసెట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించవచ్చని ప్రముఖ న్యాయవాది, మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులకు ఆయన శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. పరీక్షల్లో గరిష్ట మార్కులు సాధించడానికి అనుసరించాల్సిన మెళకువలను వివరించారు. సమయపాలన పాటిస్తూ, క్లిష్టమైన అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం రత్నం ఫౌండేషన్ వారు ఉచితంగా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని, ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణ శిబిరాన్ని సందర్శించిన శివకుమార్ గౌడ్‌ను రత్నం ఫౌండేషన్ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. సామాజిక స్పృహతో ఆయన అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News