Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:39 AM

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతో ముందుకు సాగాలి: సర్పంచ్ కాటం వెంకటేశం

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతో ముందుకు సాగాలి: సర్పంచ్ కాటం వెంకటేశం

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతో ముందుకు సాగాలి: సర్పంచ్ కాటం వెంకటేశం
11-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామపంచాయతీ పరిధిలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు నేటి రోజుల్లో ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో శిఖరాలను అధిరోహిస్తున్నారంటే, పూలే దంపతులు చేసిన కృషి ఎంతో గొప్పదని తెలిపారు. ముఖ్యంగా సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు విద్యా వెలుగులు ప్రసరింపజేశారని కొనియాడారు.సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ప్రస్తుత సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. మహాత్మా పూలే ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కురు యాదయ్య, జల ప్రశాంత్, సాగర్ నాగరాజు, నూతి వెంకన్న, బుంగపట్ల తిమ్మయ్య, మొర శీను, పున్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతో ముందుకు సాగాలి: సర్పంచ్ కాటం వెంకటేశం

Article Image

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామపంచాయతీ పరిధిలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు నేటి రోజుల్లో ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో శిఖరాలను అధిరోహిస్తున్నారంటే, పూలే దంపతులు చేసిన కృషి ఎంతో గొప్పదని తెలిపారు. ముఖ్యంగా సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు విద్యా వెలుగులు ప్రసరింపజేశారని కొనియాడారు.సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ప్రస్తుత సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. మహాత్మా పూలే ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కురు యాదయ్య, జల ప్రశాంత్, సాగర్ నాగరాజు, నూతి వెంకన్న, బుంగపట్ల తిమ్మయ్య, మొర శీను, పున్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News