Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:22 PM

ఇతర రాష్ట్రాల వ్యాపారుల దండయాత్ర అరికట్టాలి: మండల అధికారులకు వర్తక సంఘ జేఏసీ వినతి

ఇతర రాష్ట్రాల వ్యాపారుల దండయాత్ర అరికట్టాలి: మండల అధికారులకు వర్తక సంఘ జేఏసీ వినతి

ఇతర రాష్ట్రాల వ్యాపారుల దండయాత్ర అరికట్టాలి: మండల అధికారులకు వర్తక సంఘ జేఏసీ వినతి
February 04, 2026 09:22 AM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వర్తక సంఘ జేఏసీ ఆధ్వర్యంలో వర్తక సంఘ నాయకులు మంగళవారం స్థానిక తహసిల్దార్ జి. దశరథ, మండల అభివృద్ధి పరిషత్ అధికారి జలంధర్ రెడ్డి, సబ్‌ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ గౌడ్, సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డిలకు వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వర్తక సంఘ మండల అధ్యక్షుడు బెలిదే శ్రీనివాస్ మాట్లాడుతూ…

స్థానిక వ్యాపారులు ఎన్నో ఏళ్లుగా వ్యాపారాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నప్పటికీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు కేవలం లాభార్జనే లక్ష్యంగా నాసిరకం వస్తువులను విక్రయిస్తూ, అధిక అద్దెలు చెల్లించి వ్యాపార సముదాయాలను ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా స్థానిక వ్యాపారులకు అద్దె భవనాలు దొరకక అప్పుల పాలవుతున్న పరిస్థితి నెలకొందన్నారు.

కావున ఇతర రాష్ట్రాల వ్యాపారులపై నియంత్రణ విధించి, స్థానిక వ్యాపారులకు చేయూతనివ్వాలని, స్థానికంగా బయటి రాష్ట్రాల వారు వ్యాపారం చేయకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు బాలా చారి, బీసీ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి, గంజి వెంకటేశం, గజ్జల అమరేందర్, లెనిన్, నామాల జగన్, గంజి ఉపేందర్, అప్పిశెట్టి సంతోష్, బడుగు లింగస్వామి తదితర వర్తక సంఘ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News