Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:40 AM

ఇతర రాష్ట్రాల వ్యాపారుల దండయాత్ర అరికట్టాలి: మండల అధికారులకు వర్తక సంఘ జేఏసీ వినతి

ఇతర రాష్ట్రాల వ్యాపారుల దండయాత్ర అరికట్టాలి: మండల అధికారులకు వర్తక సంఘ జేఏసీ వినతి

ఇతర రాష్ట్రాల వ్యాపారుల దండయాత్ర అరికట్టాలి: మండల అధికారులకు వర్తక సంఘ జేఏసీ వినతి
February 04, 2026 09:22 AM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వర్తక సంఘ జేఏసీ ఆధ్వర్యంలో వర్తక సంఘ నాయకులు మంగళవారం స్థానిక తహసిల్దార్ జి. దశరథ, మండల అభివృద్ధి పరిషత్ అధికారి జలంధర్ రెడ్డి, సబ్‌ ఇన్‌స్పెక్టర్ యుగంధర్ గౌడ్, సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డిలకు వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వర్తక సంఘ మండల అధ్యక్షుడు బెలిదే శ్రీనివాస్ మాట్లాడుతూ…

స్థానిక వ్యాపారులు ఎన్నో ఏళ్లుగా వ్యాపారాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నప్పటికీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు కేవలం లాభార్జనే లక్ష్యంగా నాసిరకం వస్తువులను విక్రయిస్తూ, అధిక అద్దెలు చెల్లించి వ్యాపార సముదాయాలను ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా స్థానిక వ్యాపారులకు అద్దె భవనాలు దొరకక అప్పుల పాలవుతున్న పరిస్థితి నెలకొందన్నారు.

కావున ఇతర రాష్ట్రాల వ్యాపారులపై నియంత్రణ విధించి, స్థానిక వ్యాపారులకు చేయూతనివ్వాలని, స్థానికంగా బయటి రాష్ట్రాల వారు వ్యాపారం చేయకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు బాలా చారి, బీసీ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి, గంజి వెంకటేశం, గజ్జల అమరేందర్, లెనిన్, నామాల జగన్, గంజి ఉపేందర్, అప్పిశెట్టి సంతోష్, బడుగు లింగస్వామి తదితర వర్తక సంఘ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News