ఇంద్రపాలనగరంలో అనసూయ మృతికి సర్పంచ్ నివాళులు
ఇంద్రపాలనగరంలో అనసూయ మృతికి సర్పంచ్ నివాళులు
స్థానికం బృందం
ఇంద్రపాలనగరంలో గర్ధాస్ అనసూయ మృతి పట్ల స్థానిక నాయకులు, యువనాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అనసూయ పార్థివదేహానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అనసూయ మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, కాటపల్లి యాదయ్య, మందడి శ్రీధర్ రెడ్డి, ఈర్లపల్లి మల్లయ్య, మండల నాయకులు రాస వెంకటేశం, కార్యదర్శి రవ్వ నర్సింహా, గర్ధాస్ కరుణాకర్, నక్క వెంకటేశం, గర్ధాస్ వెంకటేష్, సింగణబోయిన దినేష్, మంటి బిక్షం, రేపాక సత్తయ్య, రాదారపు మల్లేశం, గర్ధాస్ శ్రీకాంత్, గోళ్లేపల్లి యాదయ్య, గర్ధాస్ సాయి, కంబాలపల్లి శ్రీశైలం, శివగల్ల సంపత్, బోనగిరి మధు, బోనగిరి మహేష్, వెలిమినేటి నరేష్, పుట్టల సాయికుమార్, నీరుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి