Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 04:16 AM

ఇంద్రపాలనగరంలో పేద కుటుంబానికి సొంతింటి పండుగ… ఎమ్మెల్యే వేముల వీరేశం

ఇంద్రపాలనగరంలో పేద కుటుంబానికి సొంతింటి పండుగ… ఎమ్మెల్యే వేముల వీరేశం

ఇంద్రపాలనగరంలో పేద కుటుంబానికి సొంతింటి పండుగ… ఎమ్మెల్యే వేముల వీరేశం
20-02-2026 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన ఏర్వ మమత–గణేష్ దంపతుల సొంతింటి కల సాకారమైన వేళ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో వేముల వీరేశం పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు గృహాల పంపిణీ వేగవంతమైందని, గత పదేళ్ల పాలనలో పేదలకు గృహాల కేటాయింపులో నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు.

నకిరేకల్ నియోజకవర్గానికి తొలి విడతగా 3,500 ఇండ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇండ్లు లేని ప్రతి అర్హ కుటుంబానికి విడతల వారీగా గృహాలు అందజేసి, వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేదల జీవన ప్రమాణాల మెరుగుదల ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై గృహప్రవేశ వేడుకను పండుగ వాతావరణంలో నిర్వహించారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో పేద కుటుంబానికి సొంతింటి పండుగ… ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన ఏర్వ మమత–గణేష్ దంపతుల సొంతింటి కల సాకారమైన వేళ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో వేముల వీరేశం పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు గృహాల పంపిణీ వేగవంతమైందని, గత పదేళ్ల పాలనలో పేదలకు గృహాల కేటాయింపులో నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు.

నకిరేకల్ నియోజకవర్గానికి తొలి విడతగా 3,500 ఇండ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇండ్లు లేని ప్రతి అర్హ కుటుంబానికి విడతల వారీగా గృహాలు అందజేసి, వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేదల జీవన ప్రమాణాల మెరుగుదల ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై గృహప్రవేశ వేడుకను పండుగ వాతావరణంలో నిర్వహించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News