ఇంద్రపాలనగరంలో పేద కుటుంబానికి సొంతింటి పండుగ… ఎమ్మెల్యే వేముల వీరేశం
ఇంద్రపాలనగరంలో పేద కుటుంబానికి సొంతింటి పండుగ… ఎమ్మెల్యే వేముల వీరేశం
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన ఏర్వ మమత–గణేష్ దంపతుల సొంతింటి కల సాకారమైన వేళ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో వేముల వీరేశం పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు గృహాల పంపిణీ వేగవంతమైందని, గత పదేళ్ల పాలనలో పేదలకు గృహాల కేటాయింపులో నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు.
నకిరేకల్ నియోజకవర్గానికి తొలి విడతగా 3,500 ఇండ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఇండ్లు లేని ప్రతి అర్హ కుటుంబానికి విడతల వారీగా గృహాలు అందజేసి, వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పేదల జీవన ప్రమాణాల మెరుగుదల ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై గృహప్రవేశ వేడుకను పండుగ వాతావరణంలో నిర్వహించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి