ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు
ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు
Editor Desk
ఇంద్రపాలనగరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామంలో శివాజీ మహారాజ్ శాశ్వత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, సర్పంచ్ తన వంతుగా రూ.20,116 విరాళం ప్రకటించారు.
అలాగే యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ రూ.10,116, నాగు మహేష్ రూ.10,016 విరాళాలు ప్రకటించి శివాజీపై తమ అభిమానం చాటుకున్నారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజన్నగారి రమేష్, ఈర్లపల్లి మల్లేశం, బాజ నరేందర్, బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు కొడారి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వేడుకలను సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఇతర నాయకులు బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, వెలిమినేటి నరేష్, కేస సందీప్, కేస ప్రవీణ్, పబ్బు మచ్చి, బొల్ల మచ్చి, బొల్ల నర్సింహా, పగుడాల రామచంద్రం, నీలశ్రీరాములు, ఏర్వ సాయి, గర్ధాస్ మహేష్, మల్లం రమేష్, ఎర్రం ఇలాజి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి