Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:41 AM

ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు

ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు

ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు
February 19, 2026 02:02 PM 164 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామంలో శివాజీ మహారాజ్ శాశ్వత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, సర్పంచ్ తన వంతుగా రూ.20,116 విరాళం ప్రకటించారు.

అలాగే యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ రూ.10,116, నాగు మహేష్ రూ.10,016 విరాళాలు ప్రకటించి శివాజీపై తమ అభిమానం చాటుకున్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజన్నగారి రమేష్, ఈర్లపల్లి మల్లేశం, బాజ నరేందర్, బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు కొడారి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వేడుకలను సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఇతర నాయకులు బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, వెలిమినేటి నరేష్, కేస సందీప్, కేస ప్రవీణ్, పబ్బు మచ్చి, బొల్ల మచ్చి, బొల్ల నర్సింహా, పగుడాల రామచంద్రం, నీలశ్రీరాములు, ఏర్వ సాయి, గర్ధాస్ మహేష్, మల్లం రమేష్, ఎర్రం ఇలాజి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News