హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో 10 రోజుల సస్టైనబిలిటీ శిక్షణ విజయవంతం
హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో 10 రోజుల సస్టైనబిలిటీ శిక్షణ విజయవంతం
స్థానికం బృందం
హైదరాబాద్, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్మే నేజంగ్ “డేటా ఆధారిత నిర్ణయాల ద్వారా సస్టైనబిలిటీ” అంశంపై నిర్వహించిన పది రోజుల ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ప్రారంభ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ Dr. S అరవింద్ పాల్గొని, సస్టైనబిలిటీ మరియు డేటా విశ్లేషణ ప్రాముఖ్యతపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాల సామర్థ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
శిక్షణలో భాగంగా విద్యార్థులకు డేటా విశ్లేషణ, వ్యాపార మేధస్సు, వనరుల పునర్వినియోగ ఆర్థిక విధానం, సుస్థిర వ్యర్థాల నిర్వహణ అంశాలపై ప్రాయోగిక అవగాహన కల్పించారు.
కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి Dr. S V హేమంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థుల డేటా ఆధారిత ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించిందన్నారు. కార్యక్రమ కన్వీనర్ T రాఘవేంద్ర గుప్త పాల్గొన్న వారికి ప్రాయోగిక జ్ఞానం లభించిందని తెలిపారు. సహ-కన్వీనర్ సురేస్మ మమతా ఈ శిక్షణ ద్వారా విద్యా రంగం మరియు పరిశ్రమల అవసరాల మధ్య అనుసంధానం బలోపేతమైందని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి