Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 06:37 AM

హెల్మెట్ లేకుంటే పెట్రోల్‌కు నో... కలెక్టర్ హనుమంతరావు

హెల్మెట్ లేకుంటే పెట్రోల్‌కు నో... కలెక్టర్ హనుమంతరావు

హెల్మెట్ లేకుంటే పెట్రోల్‌కు నో... కలెక్టర్ హనుమంతరావు
21-02-2026 180 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,: జిల్లాలో రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ విక్రయించవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్ యజమానులు, నిర్వాహకులు కచ్చితంగా ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు.

హెల్మెట్ లేకుండా పెట్రోల్ కోసం వచ్చే ద్విచక్ర వాహనదారులకు ముందుగా అవగాహన కల్పించి, హెల్మెట్ ధరించిన తర్వాతే పెట్రోల్ నింపాలని సూచించారు. పెట్రోల్ బంక్ ప్రాంగణంలో ‘హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు’ అనే స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత సిబ్బందికి కూడా ఈ నిర్ణయంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆదేశాలను పాటించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Sthanikam

హెల్మెట్ లేకుంటే పెట్రోల్‌కు నో... కలెక్టర్ హనుమంతరావు

Article Image

యాదాద్రి భువనగిరి,: జిల్లాలో రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ విక్రయించవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్ యజమానులు, నిర్వాహకులు కచ్చితంగా ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు.

హెల్మెట్ లేకుండా పెట్రోల్ కోసం వచ్చే ద్విచక్ర వాహనదారులకు ముందుగా అవగాహన కల్పించి, హెల్మెట్ ధరించిన తర్వాతే పెట్రోల్ నింపాలని సూచించారు. పెట్రోల్ బంక్ ప్రాంగణంలో ‘హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు’ అనే స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత సిబ్బందికి కూడా ఈ నిర్ణయంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆదేశాలను పాటించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News