హెల్మెట్ లేకుంటే పెట్రోల్కు నో... కలెక్టర్ హనుమంతరావు
హెల్మెట్ లేకుంటే పెట్రోల్కు నో... కలెక్టర్ హనుమంతరావు
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి,: జిల్లాలో రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ విక్రయించవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్ యజమానులు, నిర్వాహకులు కచ్చితంగా ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు.
హెల్మెట్ లేకుండా పెట్రోల్ కోసం వచ్చే ద్విచక్ర వాహనదారులకు ముందుగా అవగాహన కల్పించి, హెల్మెట్ ధరించిన తర్వాతే పెట్రోల్ నింపాలని సూచించారు. పెట్రోల్ బంక్ ప్రాంగణంలో ‘హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు’ అనే స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సంబంధిత సిబ్బందికి కూడా ఈ నిర్ణయంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆదేశాలను పాటించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి