Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:13 AM

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధి అవకాశాల శిబిరం విజయవంతం

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధి అవకాశాల శిబిరం విజయవంతం

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధి అవకాశాల శిబిరం విజయవంతం
February 23, 2026 06:15 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

52 మంది విద్యార్థులకు నియామక పత్రాలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్లో నిర్వహించిన భారీ ఉపాధి అవకాశాల శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 52 మంది విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు.

కళాశాల ఆంగ్ల విభాగం, ఉపాధి మార్గదర్శక విభాగం, తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో, లక్ష్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థలు అయిన విప్రో, రామోజీ ఫిల్మ్ సిటీ, జస్ట్ డయల్, ముత్తూట్ ఫైనాన్స్ తదితర సంస్థలు పాల్గొని విద్యార్థులను ఎంపిక చేశాయి.

మొత్తం 302 మంది అభ్యర్థులు హాజరుకాగా, వంద మందికి పైగా ఎంపికయ్యారు. అందులో 52 మంది విద్యార్థులు తక్షణ నియామక పత్రాలను స్వీకరించారు. ఇంటర్వ్యూలు, ఎంపిక ప్రక్రియలు రోజంతా ఉత్సాహంగా సాగాయి.

ఈ సందర్భంగా జిల్లా ఉపాధి మరియు శిక్షణాధికారి రవీందర్ మాట్లాడుతూ ఉపాధి ప్రాధాన్యతను వివరించి, ప్రైవేటు రంగంలో అవకాశాలు పొందేందుకు యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు విద్యార్థులు క్రమశిక్షణ, పని సంస్కృతి అలవర్చుకొని తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వృత్తి జీవితంలో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.

లక్ష్ ఫౌండేషన్ ప్రతినిధి సుమన్ మాట్లాడుతూ యువత ఈ అవకాశాన్ని ప్రారంభంగా తీసుకొని తమ వృత్తి జీవితాన్ని స్థిరపరచుకోవాలని సూచించారు. ఉపాధి మార్గదర్శక విభాగం అధికారి డాక్టర్ ఎ. దుర్గప్రసాద్ ఇటువంటి శిబిరాలు విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News