Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:22 AM

హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!

హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!

హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!
31-01-2026 629 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానవ విలువలు ఎటు పోతున్నాయి?

మనవత్వాన్ని సైతం ప్రశ్నించే దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు సొంత చెల్లెలిని హత్య చేసి, వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగర జిల్లా కొట్టూరులో జరిగిన ఈ సంఘటన శుక్రవారం బయటపడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.పోలీసుల సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదాలే ఈ అమానుష ఘటనకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కుటుంబ బంధాలే బలహీనపడుతున్న ఈ రోజుల్లో, సొంత రక్త సంబంధాలనే హత్య చేయడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.ఇట్లోనే మృతదేహాలను పూడ్చిపెట్టడం ద్వారా నేరాన్ని దాచిపెట్టాలని నిందితుడు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటన మానవ విలువలు, కుటుంబ సంబంధాల ప్రాధాన్యతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకప్పుడు బంధుత్వాలు, అనురాగాలే జీవితానికి ఆధారంగా నిలిచిన సమాజంలో, ఇలాంటి ఘోరాలు చోటుచేసుకోవడం మనం ఏ దిశగా ప్రయాణిస్తున్నామన్న ఆలోచనకు దారితీస్తోంది.మానవ విలువలు ఎటు పోతున్నాయి? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Sthanikam

హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!

Article Image

మానవ విలువలు ఎటు పోతున్నాయి?

మనవత్వాన్ని సైతం ప్రశ్నించే దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు సొంత చెల్లెలిని హత్య చేసి, వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగర జిల్లా కొట్టూరులో జరిగిన ఈ సంఘటన శుక్రవారం బయటపడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.పోలీసుల సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదాలే ఈ అమానుష ఘటనకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కుటుంబ బంధాలే బలహీనపడుతున్న ఈ రోజుల్లో, సొంత రక్త సంబంధాలనే హత్య చేయడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.ఇట్లోనే మృతదేహాలను పూడ్చిపెట్టడం ద్వారా నేరాన్ని దాచిపెట్టాలని నిందితుడు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటన మానవ విలువలు, కుటుంబ సంబంధాల ప్రాధాన్యతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకప్పుడు బంధుత్వాలు, అనురాగాలే జీవితానికి ఆధారంగా నిలిచిన సమాజంలో, ఇలాంటి ఘోరాలు చోటుచేసుకోవడం మనం ఏ దిశగా ప్రయాణిస్తున్నామన్న ఆలోచనకు దారితీస్తోంది.మానవ విలువలు ఎటు పోతున్నాయి? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News