హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!
హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!
Krishna
మానవ విలువలు ఎటు పోతున్నాయి?
మనవత్వాన్ని సైతం ప్రశ్నించే దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు సొంత చెల్లెలిని హత్య చేసి, వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగర జిల్లా కొట్టూరులో జరిగిన ఈ సంఘటన శుక్రవారం బయటపడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.పోలీసుల సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదాలే ఈ అమానుష ఘటనకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కుటుంబ బంధాలే బలహీనపడుతున్న ఈ రోజుల్లో, సొంత రక్త సంబంధాలనే హత్య చేయడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.ఇట్లోనే మృతదేహాలను పూడ్చిపెట్టడం ద్వారా నేరాన్ని దాచిపెట్టాలని నిందితుడు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటన మానవ విలువలు, కుటుంబ సంబంధాల ప్రాధాన్యతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకప్పుడు బంధుత్వాలు, అనురాగాలే జీవితానికి ఆధారంగా నిలిచిన సమాజంలో, ఇలాంటి ఘోరాలు చోటుచేసుకోవడం మనం ఏ దిశగా ప్రయాణిస్తున్నామన్న ఆలోచనకు దారితీస్తోంది.మానవ విలువలు ఎటు పోతున్నాయి? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి