Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుటుంబానికి అండగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 11:09 AM

హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!

హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!

హత్య చేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!
January 31, 2026 01:40 PM 602 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానవ విలువలు ఎటు పోతున్నాయి?

మనవత్వాన్ని సైతం ప్రశ్నించే దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు సొంత చెల్లెలిని హత్య చేసి, వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగర జిల్లా కొట్టూరులో జరిగిన ఈ సంఘటన శుక్రవారం బయటపడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.పోలీసుల సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదాలే ఈ అమానుష ఘటనకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కుటుంబ బంధాలే బలహీనపడుతున్న ఈ రోజుల్లో, సొంత రక్త సంబంధాలనే హత్య చేయడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.ఇట్లోనే మృతదేహాలను పూడ్చిపెట్టడం ద్వారా నేరాన్ని దాచిపెట్టాలని నిందితుడు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటన మానవ విలువలు, కుటుంబ సంబంధాల ప్రాధాన్యతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకప్పుడు బంధుత్వాలు, అనురాగాలే జీవితానికి ఆధారంగా నిలిచిన సమాజంలో, ఇలాంటి ఘోరాలు చోటుచేసుకోవడం మనం ఏ దిశగా ప్రయాణిస్తున్నామన్న ఆలోచనకు దారితీస్తోంది.మానవ విలువలు ఎటు పోతున్నాయి? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News