హస్తినాపురం ఈస్ట్ కాలనీలో కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు శంకుస్థాపన.రాగుల వెంకటేశ్వర్ రెడ్డి
హస్తినాపురం ఈస్ట్ కాలనీలో కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు శంకుస్థాపన.రాగుల వెంకటేశ్వర్ రెడ్డి
స్థానికం బృందం
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని హస్తినాపురం ఈస్ట్ కాలనీ ఫేజ్–3లో ఉన్న కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులకు సోమవారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసుల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుకూలంగా కమ్యూనిటీ హాల్ను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, కర్మాంగట్ హనుమాన్ దేవాలయం డైరెక్టర్ కవిత, కాలనీ అధ్యక్షుడు సతీష్ పాల్గొని మాట్లాడారు. అలాగే అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షుడు గంగిరెడ్డి, గుంటి జంగయ్య కాలనీ వాసి ప్రకాష్ పాల్గొన్నారు. కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణతో కాలనీలోని ప్రజలకు మరింత మేలు జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి