Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:12 AM

హస్తినాపురం ఈస్ట్ కాలనీలో కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు శంకుస్థాపన.రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

హస్తినాపురం ఈస్ట్ కాలనీలో కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు శంకుస్థాపన.రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

హస్తినాపురం ఈస్ట్ కాలనీలో కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు శంకుస్థాపన.రాగుల వెంకటేశ్వర్ రెడ్డి
08-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని హస్తినాపురం ఈస్ట్ కాలనీ ఫేజ్–3లో ఉన్న కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులకు సోమవారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసుల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుకూలంగా కమ్యూనిటీ హాల్‌ను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, కర్మాంగట్ హనుమాన్ దేవాలయం డైరెక్టర్ కవిత, కాలనీ అధ్యక్షుడు సతీష్ పాల్గొని మాట్లాడారు. అలాగే అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షుడు గంగిరెడ్డి, గుంటి జంగయ్య కాలనీ వాసి ప్రకాష్ పాల్గొన్నారు. కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణతో కాలనీలోని ప్రజలకు మరింత మేలు జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Sthanikam

హస్తినాపురం ఈస్ట్ కాలనీలో కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు శంకుస్థాపన.రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

Article Image

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని హస్తినాపురం ఈస్ట్ కాలనీ ఫేజ్–3లో ఉన్న కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులకు సోమవారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసుల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుకూలంగా కమ్యూనిటీ హాల్‌ను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, కర్మాంగట్ హనుమాన్ దేవాలయం డైరెక్టర్ కవిత, కాలనీ అధ్యక్షుడు సతీష్ పాల్గొని మాట్లాడారు. అలాగే అభ్యుదయ నగర్ కాలనీ అధ్యక్షుడు గంగిరెడ్డి, గుంటి జంగయ్య కాలనీ వాసి ప్రకాష్ పాల్గొన్నారు. కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణతో కాలనీలోని ప్రజలకు మరింత మేలు జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News