హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధం – జోగు అంజన్న
హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధం – జోగు అంజన్న
స్థానికం బృందం
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యమకారుల హామీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న విమర్శించారు. బుధవారం వలిగొండలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండున్నర సంవత్సరాలు గడిచినా ఉద్యమకారుల సమస్యలపై ఒక్క కమిటీ కూడా నియమించకపోవడం, తొలి దశ–మలిదశ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించకపోవడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేస్తూ వాయిదా వేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నెలకొన్నదన్నారు.
ఉద్యమ కాలంలో విశేషంగా సేవలందించిన పలువురు ఉద్యమకారులు గత కొన్నేళ్లలో మరణించినప్పటికీ వారికి సరైన గుర్తింపు, సాయసహాయాలు అందకపోవడం బాధాకరమని అంజన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి హామీల అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి