Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 11:02 PM

హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధం – జోగు అంజన్న

హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధం – జోగు అంజన్న

హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధం – జోగు అంజన్న
18-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యమకారుల హామీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న విమర్శించారు. బుధవారం వలిగొండలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రెండున్నర సంవత్సరాలు గడిచినా ఉద్యమకారుల సమస్యలపై ఒక్క కమిటీ కూడా నియమించకపోవడం, తొలి దశ–మలిదశ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించకపోవడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేస్తూ వాయిదా వేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నెలకొన్నదన్నారు.

ఉద్యమ కాలంలో విశేషంగా సేవలందించిన పలువురు ఉద్యమకారులు గత కొన్నేళ్లలో మరణించినప్పటికీ వారికి సరైన గుర్తింపు, సాయసహాయాలు అందకపోవడం బాధాకరమని అంజన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి హామీల అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Sthanikam

హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధం – జోగు అంజన్న

Article Image

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యమకారుల హామీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న విమర్శించారు. బుధవారం వలిగొండలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రెండున్నర సంవత్సరాలు గడిచినా ఉద్యమకారుల సమస్యలపై ఒక్క కమిటీ కూడా నియమించకపోవడం, తొలి దశ–మలిదశ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించకపోవడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేస్తూ వాయిదా వేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం నెలకొన్నదన్నారు.

ఉద్యమ కాలంలో విశేషంగా సేవలందించిన పలువురు ఉద్యమకారులు గత కొన్నేళ్లలో మరణించినప్పటికీ వారికి సరైన గుర్తింపు, సాయసహాయాలు అందకపోవడం బాధాకరమని అంజన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి హామీల అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News