హాలియాలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం. కొండేటి మల్లయ్య
హాలియాలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం. కొండేటి మల్లయ్య
స్థానికం బృందం
అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా పట్టణకేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మొదటి వార్డు అభ్యర్థి గౌని రాజా రమేష్, రెండో వార్డు అభ్యర్థి నకిరేకంటి అన్నపూర్ణ సైదులు విజయం కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారంలో నాగార్జున సాగర్ శాసనసభ్యుడు కుందూరు జైవీర్ రెడ్డి పాల్గొని ప్రజలను కలిశారు. అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఎన్నికలు స్థానిక అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే హాలియా పట్టణం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి