హైకోర్టు తీర్పుతో ఉద్యమకారులకు న్యాయం — రెబ్బాస్ రాములు హర్షం
హైకోర్టు తీర్పుతో ఉద్యమకారులకు న్యాయం — రెబ్బాస్ రాములు హర్షం
Editor Desk
రామన్నపేట, తెలంగాణ ఉద్యమకారులకు అనుకూలంగా వెలువడిన తీర్పుపై ఉద్యమకారుడు రెబ్బాస్ రాములు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకాలంలో త్యాగాలు చేసిన వారికి ఇది న్యాయం చేసిన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి, అనేక మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం తగిన స్థాయిలో సహకారం అందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారులకు ఎనిమిది వారాల లోపు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని సంబంధిత శాఖలను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతోషకరమని తెలిపారు.
ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి విజయసేన్ రెడ్డికు రెబ్బాస్ రాములు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఈ తీర్పు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి