Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 12:46 PM

హైకోర్టు తీర్పుతో ఉద్యమకారులకు న్యాయం — రెబ్బాస్ రాములు హర్షం

హైకోర్టు తీర్పుతో ఉద్యమకారులకు న్యాయం — రెబ్బాస్ రాములు హర్షం

హైకోర్టు తీర్పుతో ఉద్యమకారులకు న్యాయం — రెబ్బాస్ రాములు హర్షం
23-02-2026 146 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, తెలంగాణ ఉద్యమకారులకు అనుకూలంగా వెలువడిన తీర్పుపై ఉద్యమకారుడు రెబ్బాస్ రాములు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకాలంలో త్యాగాలు చేసిన వారికి ఇది న్యాయం చేసిన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి, అనేక మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం తగిన స్థాయిలో సహకారం అందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారులకు ఎనిమిది వారాల లోపు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని సంబంధిత శాఖలను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతోషకరమని తెలిపారు.

ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి విజయసేన్ రెడ్డికు రెబ్బాస్ రాములు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఈ తీర్పు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Sthanikam

హైకోర్టు తీర్పుతో ఉద్యమకారులకు న్యాయం — రెబ్బాస్ రాములు హర్షం

Article Image

రామన్నపేట, తెలంగాణ ఉద్యమకారులకు అనుకూలంగా వెలువడిన తీర్పుపై ఉద్యమకారుడు రెబ్బాస్ రాములు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమకాలంలో త్యాగాలు చేసిన వారికి ఇది న్యాయం చేసిన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి, అనేక మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం తగిన స్థాయిలో సహకారం అందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారులకు ఎనిమిది వారాల లోపు ఇండ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని సంబంధిత శాఖలను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతోషకరమని తెలిపారు.

ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి విజయసేన్ రెడ్డికు రెబ్బాస్ రాములు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఈ తీర్పు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News