Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:01 PM

హామీలకే పరిమితమైన చేనేత రుణమాఫీ – ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు

హామీలకే పరిమితమైన చేనేత రుణమాఫీ – ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు

హామీలకే పరిమితమైన చేనేత రుణమాఫీ – ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు
December 27, 2025 10:30 AM 522 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk


పాలాభిషేకాలు తప్ప ప్రగతి లేదు – చేనేతపై ప్రభుత్వ చిన్న చూపు

స్థానిక ప్రతినిధి

తెలంగాణలో చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాలు, మొత్తం చేనేత పరిశ్రమ పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా పద్మశాలి తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు రూ.33 కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించి ఏడాది గడిచిపోయినప్పటికీ, ఆ హామీ కాగితాలకే పరిమితమైందని ఆరోపించారు. అధికారులు డబ్బులు విడుదల చేశామని చెబుతున్నా, ఇప్పటికీ చేనేత కార్మికులకు రుణమాఫీ అమలుకాకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.

మరోవైపు, చేనేత సహకార సంఘాలకు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సంఘాల సమస్యలను పట్టించుకునే దిక్కులేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాలకు సంబంధించిన సుమారు రూ.50 కోట్ల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేసి, సంఘాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదని మండిపడ్డారు.

వేల కోట్ల రూపాయల రుణమాఫీలు చేస్తున్న ప్రభుత్వం, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత పరిశ్రమకు సంబంధించిన ఈ చిన్న రుణాలను మాఫీ చేయడంలో చూపుతున్న నిర్లక్ష్యం, పద్మశాలి సమాజం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపునే స్పష్టం చేస్తోందని విమర్శించారు.

ఇదే నిర్లక్ష్య ధోరణి కొనసాగితే రానున్న రోజుల్లో ప్రభుత్వం తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News