Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 01:53 AM

గురుకుశివకు నివాళులర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

గురుకుశివకు నివాళులర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

గురుకుశివకు నివాళులర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
February 05, 2026 05:49 PM 507 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

కాంగ్రెస్ నాయకుడి ఆకస్మిక మృతి

రామన్నపేట మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గురుకుశివ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణవార్త కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం గురుకుశివ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు గురుకుశివ సేవలను స్మరించుకున్నారు. ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు


.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్, రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జినుకల ప్రభాకర్, వనం చంద్రశేఖర్, గుత్తా నర్సి రెడ్డి, సాల్వేరు అశోక్, గోదాసు పృథ్వీరాజ్, రెహాన్, ఎండి నాసర్, గోదాసు శ్రీమన్నారాయణ, బొడ్డు సాలయ్య, బొడ్డు శంకరయ్య, పున్న అమరేందర్, బత్తుల నవీన్, మహమ్మద్ జానీ, ఎండి అజార్, కొమ్ము రామస్వామి, గొలుసుల ప్రసాద్, కొమ్ము శేఖర్, బొడ్డు సైదులు, మినముల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News