Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 09:32 PM

గొట్టిపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన; మార్కెట్ వైస్ చైర్మన్ వెంకన్న, సర్పంచ్ మంజుల

గొట్టిపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన; మార్కెట్ వైస్ చైర్మన్ వెంకన్న, సర్పంచ్ మంజుల

గొట్టిపర్తిలో  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన; మార్కెట్ వైస్ చైర్మన్ వెంకన్న, సర్పంచ్ మంజుల
April 13, 2026 07:35 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


తుంగతుర్తిమండలం గొట్టిపర్తి గ్రామంలో నిర్వహించిన ఐకెపి 1, ఐకెపి 2, ధాన్యం కొనుగోలు కేంద్రానీ తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సర్పంచ్ చిలుకల మంజుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి క్వింటాకు 500 బోనస్ అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రైతులకు ఉచిత కరెంట్, రుణ మాఫీ, రైతు భరోసా, 500 బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. అందుకోసమే రాష్ట్రంలో సన్నాలు పండించే రైతులను ప్రోత్సహస్తుందని అన్నారు. దీనివల్ల మన రైతుల వద్దనే సన్నాలు కొని మళ్ళీ మనకే సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందువలన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్మాలని సూచించారు. తేమ 17 శాతం ఉండాలని, బస్తా 41 కేజీలు మాత్రమే తూకం వేయాలని ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపీఎం యాదమ్మ, ఉప సర్పంచ్ శ్రీకాంత్ ,cc, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్న,ఐకెపి నిర్వాకులు రజిత, శ్వేత, రమ, హైమవతి, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News