గొర్రెలు–మేకలకు ఉచిత టీకాలు సద్వినియోగం చేసుకోవాలి : గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్
గొర్రెలు–మేకలకు ఉచిత టీకాలు సద్వినియోగం చేసుకోవాలి : గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు అమ్మ తల్లి నివారణ ప్రభుత్వ ఉచిత టీకాల కార్యక్రమాన్ని శ్రీ మల్లికార్జున గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం అధ్యక్షురాలు గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి రామన్నపేట వెటర్నరీ హాస్పిటల్కు చెందిన ఏడి డాక్టర్ ఇందిర హాజరై గొర్రెలు, మేకలకు టీకాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ, గొర్రెలు–మేకల పెంపకం దారులందరూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలను తప్పనిసరిగా వేయించుకొని పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.అనంతరం డాక్టర్ ఇందిరను శ్రీ మల్లికార్జున గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం తరఫున శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రాజు, ఆఫీస్ సబార్డినేట్ సునీత, సొసైటీ ప్రధాన కార్యదర్శి పండుగ స్వామి యాదవ్, ఉపాధ్యక్షులు ఎరబోయిన కృష్ణ యాదవ్, డైరెక్టర్ బాత్క నరేష్ యాదవ్, అలాగే గొర్రెలు–మేకల పెంపకం దారులు పండగ శివ యాదవ్, పండగ గంగులు యాదవ్, రాచమల్ల నరసింహ యాదవ్, ఎర్రబోయిన సత్తయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి