Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:22 AM

గొర్రెలు–మేకలకు ఉచిత టీకాలు సద్వినియోగం చేసుకోవాలి : గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్

గొర్రెలు–మేకలకు ఉచిత టీకాలు సద్వినియోగం చేసుకోవాలి : గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్

గొర్రెలు–మేకలకు ఉచిత టీకాలు సద్వినియోగం చేసుకోవాలి : గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్
January 31, 2026 07:00 AM 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు అమ్మ తల్లి నివారణ ప్రభుత్వ ఉచిత టీకాల కార్యక్రమాన్ని శ్రీ మల్లికార్జున గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం అధ్యక్షురాలు గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి రామన్నపేట వెటర్నరీ హాస్పిటల్‌కు చెందిన ఏడి డాక్టర్ ఇందిర హాజరై గొర్రెలు, మేకలకు టీకాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోగు పద్మ వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ, గొర్రెలు–మేకల పెంపకం దారులందరూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలను తప్పనిసరిగా వేయించుకొని పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.అనంతరం డాక్టర్ ఇందిరను శ్రీ మల్లికార్జున గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం తరఫున శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రాజు, ఆఫీస్ సబార్డినేట్ సునీత, సొసైటీ ప్రధాన కార్యదర్శి పండుగ స్వామి యాదవ్, ఉపాధ్యక్షులు ఎరబోయిన కృష్ణ యాదవ్, డైరెక్టర్ బాత్క నరేష్ యాదవ్, అలాగే గొర్రెలు–మేకల పెంపకం దారులు పండగ శివ యాదవ్, పండగ గంగులు యాదవ్, రాచమల్ల నరసింహ యాదవ్, ఎర్రబోయిన సత్తయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News