గంటలోనే రూ.6 లక్షల బంగారం బ్యాగ్ వెతికి అందించిన ఆదోని పోలీసులు!
గంటలోనే రూ.6 లక్షల బంగారం బ్యాగ్ వెతికి అందించిన ఆదోని పోలీసులు!
స్థానికం బృందం
ఆదోని: కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ తన బ్యాగ్ను బస్సులోనే మరిచిపోయి దిగిన ఘటనలో, ఆదోని టౌన్ పోలీసులు శీఘ్రంగా స్పందించి విలువైన బంగారు ఆభరణాలను ఆమెకు అప్పగించారు.
విశాల్ మార్ట్ వద్ద బస్సు దిగిన అనంతరం బ్యాగ్ గుర్తుకు రావడంతో బాధితురాలు ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లి డ్రైవర్ను సంప్రదించారు. బస్సులో వెతికినా బ్యాగ్ దొరకకపోవడంతో సాయంత్రం 3.30 గంటలకు ఆదోని ఐ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సీఐ పి . చంద్రశేఖర్ఆ దేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మానంద రెడ్డి, కానిస్టేబుల్ సజ్జన్, విజయ్ కుమార్లు సీసీ ఫుటేజీలు పరిశీలించి, డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పట్టణంలో గాలింపు చేపట్టారు. సాయంత్రం 4.30 గంటలకు బ్యాగ్ను గుర్తించి బాధితురాలికి అందజేశారు.
బ్యాగ్లో సుమారు రూ.6 లక్షల విలువైన నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వేగవంతమైన చర్యలతో విలువైన ఆభరణాలు తిరిగి అందించడంపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి