Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:35 PM

గంధమల్ల రిజర్వాయర్ బాధిత రైతులకు ₹22.80 కోట్ల పరిహారం చెక్కులు పంపిణీ

గంధమల్ల రిజర్వాయర్ బాధిత రైతులకు ₹22.80 కోట్ల పరిహారం చెక్కులు పంపిణీ

గంధమల్ల రిజర్వాయర్ బాధిత రైతులకు ₹22.80 కోట్ల పరిహారం చెక్కులు పంపిణీ
February 18, 2026 06:51 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు, : గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య తెలిపారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు , అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి 412 మంది రైతులకు ఎకరానికి రూ.24 లక్షల 50 వేల చొప్పున 87 ఎకరాలకు గాను మొత్తం రూ.22 కోట్ల 80 లక్షల 58 వేల పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతో ఎనిమిది మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు తగిన పరిహారం అందజేసినట్లు చెప్పారు. రిజర్వాయర్ పూర్తయ్యాక ఉపాధి అవకాశాల్లో కూడా బాధిత కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. భూ సేకరణలో రైతులకు భారీ మొత్తంలో పరిహారం అందించడంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, ఈ పరిహారం రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ రవీందర్, ఈఈ రఘునాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, తుర్కపల్లి ఎమ్మార్వో జలకుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News