Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:40 AM

గంధమల్ల రిజర్వాయర్ బాధిత రైతులకు ₹22.80 కోట్ల పరిహారం చెక్కులు పంపిణీ

గంధమల్ల రిజర్వాయర్ బాధిత రైతులకు ₹22.80 కోట్ల పరిహారం చెక్కులు పంపిణీ

గంధమల్ల రిజర్వాయర్ బాధిత రైతులకు ₹22.80 కోట్ల పరిహారం చెక్కులు పంపిణీ
February 18, 2026 06:51 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు, : గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య తెలిపారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు , అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి 412 మంది రైతులకు ఎకరానికి రూ.24 లక్షల 50 వేల చొప్పున 87 ఎకరాలకు గాను మొత్తం రూ.22 కోట్ల 80 లక్షల 58 వేల పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతో ఎనిమిది మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. భూములు కోల్పోయిన రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు తగిన పరిహారం అందజేసినట్లు చెప్పారు. రిజర్వాయర్ పూర్తయ్యాక ఉపాధి అవకాశాల్లో కూడా బాధిత కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. భూ సేకరణలో రైతులకు భారీ మొత్తంలో పరిహారం అందించడంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ, ఈ పరిహారం రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ రవీందర్, ఈఈ రఘునాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, తుర్కపల్లి ఎమ్మార్వో జలకుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News