Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:03 AM

గ్రూప్‌–2లో అరుదైన ఘనత భార్య సబ్‌రిజిస్ట్రార్‌… భర్త ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌

గ్రూప్‌–2లో అరుదైన ఘనత భార్య సబ్‌రిజిస్ట్రార్‌… భర్త ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌

గ్రూప్‌–2లో అరుదైన ఘనత భార్య సబ్‌రిజిస్ట్రార్‌… భర్త ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌
January 29, 2026 08:13 AM 179 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్రంలో తాజాగా వెలువడిన గ్రూప్‌–2 ఫలితాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన భార్యాభర్తలు అరుదైన విజయంతో వార్తల్లో నిలిచారు. భార్య వినీత సబ్‌రిజిస్ట్రార్‌గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై ఒకేసారి ప్రభుత్వ సేవల్లోకి అడుగుపెట్టారు.హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ స్థిరమైన జీవితం గడుపుతున్న సమయంలో గ్రూప్‌–2 నోటిఫికేషన్ రావడంతో ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. భవిష్యత్తుపై నమ్మకంతో కఠినంగా శ్రమించి చదివారు. ఆ శ్రమకు తగిన ఫలితం దక్కింది.

భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఉద్యోగాలు సాధించడంతో వారి నివాసంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తాడిపత్రి ప్రాంతమంతా ఈ విజయం చర్చనీయాంశంగా మారింది.ఈ ఫలితాల్లో మొత్తం 891 మంది అభ్యర్థులు గ్రూప్‌–2 ఉద్యోగాలు సాధించగా, భార్యాభర్తల విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి పట్టుదల, త్యాగం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News