Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:27 PM

గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు చీఫ్ మినిస్టర్స్ కప్ పోటీలు

గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు చీఫ్ మినిస్టర్స్ కప్ పోటీలు

గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు చీఫ్ మినిస్టర్స్ కప్ పోటీలు
January 08, 2026 09:43 PM 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో నిర్వహించనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ – 2025 (2వ ఎడిషన్) క్రీడా పోటీల పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని విస్తరించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 8 నుంచి 17 వరకు పది రోజుల పాటు టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు క్రీడల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ ర్యాలీని చేపట్టనున్నారు.టార్చ్ ర్యాలీ అనంతరం దశలవారీగా పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు జరగనున్నాయి.గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని దశల్లో కలిపి మొత్తం 44 రకాల క్రీడల్లో శాట్స్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులకు ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక కల్పించడమే కాకుండా, భవిష్యత్ స్థాయి క్రీడాకారులను గుర్తించడమే ఈ కార్యక్రమ లక్ష్యంగా పేర్కొన్నారు.డిసెంబర్ నెలలో నిర్వహించాల్సిన ఈ క్రీడా పోటీలు వివిధ కారణాలతో వాయిదా పడగా, తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగనున్నాయి.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, SATG ఎండీ సోనీబాలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News