గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు చీఫ్ మినిస్టర్స్ కప్ పోటీలు
గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు చీఫ్ మినిస్టర్స్ కప్ పోటీలు
Krishna
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో నిర్వహించనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ – 2025 (2వ ఎడిషన్) క్రీడా పోటీల పోస్టర్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని విస్తరించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 8 నుంచి 17 వరకు పది రోజుల పాటు టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు క్రీడల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ ర్యాలీని చేపట్టనున్నారు.టార్చ్ ర్యాలీ అనంతరం దశలవారీగా పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు జరగనున్నాయి.గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని దశల్లో కలిపి మొత్తం 44 రకాల క్రీడల్లో శాట్స్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులకు ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక కల్పించడమే కాకుండా, భవిష్యత్ స్థాయి క్రీడాకారులను గుర్తించడమే ఈ కార్యక్రమ లక్ష్యంగా పేర్కొన్నారు.డిసెంబర్ నెలలో నిర్వహించాల్సిన ఈ క్రీడా పోటీలు వివిధ కారణాలతో వాయిదా పడగా, తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగనున్నాయి.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, SATG ఎండీ సోనీబాలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి