గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాలు,మహిళా సంఘాలకు రూ.10 లక్షల
గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాలు,మహిళా సంఘాలకు రూ.10 లక్షల
స్థానికం బృందం
చెట్ల కింద సమావేశాలకు చెక్
మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రతినిధి
ఉపాధిహామీ నిధులతో గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసింది. జిల్లాలో ఉన్న 561 గ్రామ సమాఖ్యల్లో ఇప్పటివరకు 256 గ్రామాల్లో స్థలాలను అధికారులు గుర్తించారు. మిగతా గ్రామాల్లో కూడా ఒకటి రెండు రోజుల్లో స్థలాల గుర్తింపు పూర్తయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం మహిళా స్వయం సహాయక సంఘాలు ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెట్ల కింద సమావేశాలు నిర్వహించాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. ఉపాధిహామీ నిధులతో 200 గజాల స్థలంలో కనీసం 552 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు.
స్థలాల గుర్తింపు అనంతరం గ్రామ సభలో తీర్మానం చేసి గ్రామ పంచాయతీ ద్వారా ప్రతిపాదనలు పంపనున్నారు. ఎంపీడీఓ, డీఆర్డీఏ అధికారుల తనిఖీ అనంతరం కలెక్టర్ పరిపాలనా అనుమతులు జారీ చేస్తారు. భవన నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించే అవకాశం ఉంది.
మహిళా సమాఖ్య భవనాలు మహిళా సాధికారతకు, ఆత్మగౌరవానికి కేంద్రాలుగా నిలవనున్నాయని అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి