Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:22 AM

గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాలు,మహిళా సంఘాలకు రూ.10 లక్షల

గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాలు,మహిళా సంఘాలకు రూ.10 లక్షల

గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాలు,మహిళా సంఘాలకు రూ.10 లక్షల
December 30, 2025 09:37 AM 1,533 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చెట్ల కింద సమావేశాలకు చెక్

మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు

యాదాద్రి భువనగిరి స్థానికం ప్రతినిధి

ఉపాధిహామీ నిధులతో గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసింది. జిల్లాలో ఉన్న 561 గ్రామ సమాఖ్యల్లో ఇప్పటివరకు 256 గ్రామాల్లో స్థలాలను అధికారులు గుర్తించారు. మిగతా గ్రామాల్లో కూడా ఒకటి రెండు రోజుల్లో స్థలాల గుర్తింపు పూర్తయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం మహిళా స్వయం సహాయక సంఘాలు ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెట్ల కింద సమావేశాలు నిర్వహించాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. ఉపాధిహామీ నిధులతో 200 గజాల స్థలంలో కనీసం 552 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు.

స్థలాల గుర్తింపు అనంతరం గ్రామ సభలో తీర్మానం చేసి గ్రామ పంచాయతీ ద్వారా ప్రతిపాదనలు పంపనున్నారు. ఎంపీడీఓ, డీఆర్‌డీఏ అధికారుల తనిఖీ అనంతరం కలెక్టర్ పరిపాలనా అనుమతులు జారీ చేస్తారు. భవన నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించే అవకాశం ఉంది.

మహిళా సమాఖ్య భవనాలు మహిళా సాధికారతకు, ఆత్మగౌరవానికి కేంద్రాలుగా నిలవనున్నాయని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News