Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:07 AM

గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాలు,మహిళా సంఘాలకు రూ.10 లక్షల

గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాలు,మహిళా సంఘాలకు రూ.10 లక్షల

గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాలు,మహిళా సంఘాలకు రూ.10 లక్షల
December 30, 2025 09:37 AM 1,544 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చెట్ల కింద సమావేశాలకు చెక్

మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు

యాదాద్రి భువనగిరి స్థానికం ప్రతినిధి

ఉపాధిహామీ నిధులతో గ్రామగ్రామాన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసింది. జిల్లాలో ఉన్న 561 గ్రామ సమాఖ్యల్లో ఇప్పటివరకు 256 గ్రామాల్లో స్థలాలను అధికారులు గుర్తించారు. మిగతా గ్రామాల్లో కూడా ఒకటి రెండు రోజుల్లో స్థలాల గుర్తింపు పూర్తయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం మహిళా స్వయం సహాయక సంఘాలు ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెట్ల కింద సమావేశాలు నిర్వహించాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. ఉపాధిహామీ నిధులతో 200 గజాల స్థలంలో కనీసం 552 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు.

స్థలాల గుర్తింపు అనంతరం గ్రామ సభలో తీర్మానం చేసి గ్రామ పంచాయతీ ద్వారా ప్రతిపాదనలు పంపనున్నారు. ఎంపీడీఓ, డీఆర్‌డీఏ అధికారుల తనిఖీ అనంతరం కలెక్టర్ పరిపాలనా అనుమతులు జారీ చేస్తారు. భవన నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించే అవకాశం ఉంది.

మహిళా సమాఖ్య భవనాలు మహిళా సాధికారతకు, ఆత్మగౌరవానికి కేంద్రాలుగా నిలవనున్నాయని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News