Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:38 AM

గణిత పాఠం చెప్పిన కలెక్టర్… ఆశ్చర్యపోయిన విద్యార్థులు!

గణిత పాఠం చెప్పిన కలెక్టర్… ఆశ్చర్యపోయిన విద్యార్థులు!

గణిత పాఠం చెప్పిన కలెక్టర్… ఆశ్చర్యపోయిన విద్యార్థులు!
February 18, 2026 05:22 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలో భాగంగా బుధవారం యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సందర్శించారు. అయితే ఈ తనిఖీ ప్రత్యేకత ఏమిటంటే… కలెక్టర్ స్వయంగా గణిత ఉపాధ్యాయుడిగా మారి పదవ తరగతి విద్యార్థులకు పాఠం బోధించడం!

పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య, పదవ తరగతి చదువుతున్న వారి వివరాలు, సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తయిందా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా? ఉదయం 5 గంటలకు విద్యార్థులకు వేకప్ కాల్ ఇస్తున్నారా? అంటూ ఉపాధ్యాయులను ప్రశ్నించారు.

అనంతరం 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి గణితంలో సూటి ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సమాధానాలు చెప్పిన తర్వాత బోర్డు పై స్వయంగా సమస్యలను పరిష్కరిస్తూ సులభంగా అర్థమయ్యే విధంగా బోధించారు. కలెక్టర్ బోధనకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు.

“పదవ తరగతి జీవితాన్ని మలిచే మొదటి మెట్టు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదివితే 100 శాతం ఉత్తీర్ణత సాధించవచ్చు. వెనుకబడిన సబ్జెక్టులపై మరింత శ్రద్ధ పెట్టాలి. స్వయంగా వ్రాసి సాధన చేయాలి” అని సూచించారు.

“బీద కుటుంబం నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది చదువే. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందుతోంది. ప్రతి గ్రామంలో ప్రతి విద్యార్థి ప్రభుత్వ బడిలోనే చదువుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి” అని కలెక్టర్ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News