Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:40 AM

గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు అంశంపై అధికారుల విచారణ

గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు అంశంపై అధికారుల విచారణ

గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు అంశంపై అధికారుల విచారణ
February 04, 2026 07:25 AM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు విషయంలో ఏర్పడిన పరిస్థితిపై అధికారులు విచారణ చేపట్టారు. గత రెండు నెలల క్రితం గ్రామంలో 160 మందికి పైగా హౌసింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిలో కొన్నే ఆన్‌లైన్ ప్రక్రియలో నమోదు కావడం, మిగతా దరఖాస్తులు రద్దు కావడం జరిగింది.ఈ అంశంపై గ్రామానికి చెందిన బి.విరుపాక్షి, రంగస్వామి, ఎం.తాయప్ప, పి.హనుమంత్ రెడ్డి, జెసి బంగారయ్య తదితరులు కలెక్టర్, సబ్ కలెక్టర్ కార్యాలయాలతో పాటు విజయవాడ పీజీఆర్ఎస్ (PGRS) ద్వారా ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుపై స్పందించిన హౌసింగ్ డీఈ, ఏఈ మరియు ఇతర అధికారులు నేడు గణేకల్లు గ్రామాన్ని సందర్శించి ప్రతి ఇంటినీ పరిశీలిస్తూ విచారణ నిర్వహించారు.

విచారణలో సుమారు 100కు పైగా కుటుంబాలు కొత్త ఇళ్ల మంజూరుకు అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని త్వరలోనే మంజూరు చేసే ప్రక్రియ చేపడతామని అధికారులు తెలిపారు.ఇళ్ల మంజూరు ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News