గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు అంశంపై అధికారుల విచారణ
గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు అంశంపై అధికారుల విచారణ
Editor Desk
గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు విషయంలో ఏర్పడిన పరిస్థితిపై అధికారులు విచారణ చేపట్టారు. గత రెండు నెలల క్రితం గ్రామంలో 160 మందికి పైగా హౌసింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిలో కొన్నే ఆన్లైన్ ప్రక్రియలో నమోదు కావడం, మిగతా దరఖాస్తులు రద్దు కావడం జరిగింది.ఈ అంశంపై గ్రామానికి చెందిన బి.విరుపాక్షి, రంగస్వామి, ఎం.తాయప్ప, పి.హనుమంత్ రెడ్డి, జెసి బంగారయ్య తదితరులు కలెక్టర్, సబ్ కలెక్టర్ కార్యాలయాలతో పాటు విజయవాడ పీజీఆర్ఎస్ (PGRS) ద్వారా ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై స్పందించిన హౌసింగ్ డీఈ, ఏఈ మరియు ఇతర అధికారులు నేడు గణేకల్లు గ్రామాన్ని సందర్శించి ప్రతి ఇంటినీ పరిశీలిస్తూ విచారణ నిర్వహించారు.
విచారణలో సుమారు 100కు పైగా కుటుంబాలు కొత్త ఇళ్ల మంజూరుకు అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని త్వరలోనే మంజూరు చేసే ప్రక్రియ చేపడతామని అధికారులు తెలిపారు.ఇళ్ల మంజూరు ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి