PRINT TIME: July 12, 2026 04:05 AM
గెలిచాడు కానీ... కళ్ల ముందు లేడు! రాజన్న సిరిసిల్లలో చనిపోయిన అభ్యర్థికి సర్పంచ్ పదవి
గెలిచాడు కానీ... కళ్ల ముందు లేడు! రాజన్న సిరిసిల్లలో చనిపోయిన అభ్యర్థికి సర్పంచ్ పదవి
December 12, 2025 09:13 AM
1,625 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రాజన్న సిరిసిల్ల జిల్లా
సర్పంచ్ ఎన్నికల్లో ఒక విచిత్రమైన తలతిక్క సస్పెన్స్ బయటికొచ్చింది.
వేములవాడ అర్బన్ మండలంల ఉన్న చింతల్ ఠానా (చింతలఠానా) RR కాలనీకి సర్పంచ్గా పోటీ చేసిన చొప్పరి మురళి గెలిచినట్టు ఎన్నికల ఫలితాలు వచ్చినయ్.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్!
నామినేషన్ వేసిన తర్వాతనే మురళి హార్ట్ ఎటాక్తో చనిపోయిండు. ఆయన చనిపోయినంకనే ఎన్నికలు జరిగినయ్.
అయితే, మురళి చనిపోయిండని తెలిసినా గాని, ఆ ఊరు జనం ఆయనకే ఓట్లు వేసిన్రు! ఆయన దగ్గరి అభ్యర్థి మీద ఏకంగా 300 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచిండు.
దీంతో, ఈ ఎన్నికల ఫలితం ఏం చేయాలి? మళ్లీ ఎన్నికలు పెట్టాలెనా? అని అధికారులు, ఎన్నికల సిబ్బంది తలలు పట్టుకుంటున్నరు.
అసలు మురళి గెలిచిండు, కానీ ఆయన సర్పంచ్గా ఉండడు కదా! ఇదేంది ఇట్ల అయ్యింది? అని అందరూ మాట్లాడుకుంటున్నరు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి