Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:22 AM

గడ్డి కోయడంలో శ్రమకు విముక్తి – రైతులకు వరంగా ఆధునిక యంత్రాలు

గడ్డి కోయడంలో శ్రమకు విముక్తి – రైతులకు వరంగా ఆధునిక యంత్రాలు

గడ్డి కోయడంలో శ్రమకు విముక్తి – రైతులకు వరంగా ఆధునిక యంత్రాలు
December 29, 2025 06:01 AM 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

గడ్డి కోయడంలో ఆధునిక సౌలభ్యం

రైతులకు ఉపయోగకరంగా మారిన గడ్డి కోసే యంత్రాలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

వరాలు, గట్లపై గడ్డి కోయడం రైతులకు ఎప్పటినుంచో కష్టసాధ్యమైన పని. శ్రమ ఎక్కువ, కూలీల ఖర్చు భారంగా మారిన ఈ సమయంలో ఆధునిక గడ్డి కోసే యంత్రాలు రైతులకు నిజంగా వరంగా మారాయి.

ఇటీవల రామన్నపేట పరిసర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ యంత్రాలతో తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతోనే ఎక్కువ విస్తీర్ణంలో గడ్డి కోయడం సాధ్యమవుతోంది. రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధరలో లభిస్తున్న ఈ యంత్రాలు రోజుకు ఐదు నుంచి పది ఎకరాల వరకు గట్లపై గడ్డి కోయగలవు.

మునుపు పది మంది కూలీలు పనిని ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు, కేవలం ఐదు లీటర్ల పెట్రోల్‌తో పూర్తి చేయగలుగుతున్నారు. దీని వల్ల సమయం ఆదా కావడంతో పాటు ఖర్చు గణనీయంగా తగ్గుతోంది. కూలీల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ యంత్రాల అవసరం మరింతగా పెరుగుతోంది.

వ్యవసాయ పనుల్లో యాంత్రీకరణ రైతుల భారం తగ్గిస్తూ, పనితీరును మెరుగుపరుస్తోంది. గడ్డి కోయడంలో ఈ యంత్రాల వినియోగం భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News