PRINT TIME: February 23, 2026 02:57 PM
ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అధికారి – రూ.20 వేలు స్వీకరిస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టివేత
ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అధికారి – రూ.20 వేలు స్వీకరిస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టివేత
February 22, 2026 07:40 PM
26 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరించి లంచం డిమాండ్
కంభం,: మార్కాపురం జిల్లా పరిధిలో లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కాడు.
మండలంలోని తురిమెళ్ళ గ్రామానికి చెందిన రవీంద్ర కుమార్ నిర్వహిస్తున్న ఎరువుల దుకాణ లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరిస్తూ, మండల వ్యవసాయ శాఖ అధికారి మొహమ్మద్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
దీనిపై బాధితుడు ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించగా, పక్కా ప్రణాళికతో వల పన్నారు. శుక్రవారం తన నివాసంలో బాధితుడి నుంచి రూ.20,000 లంచం స్వీకరిస్తుండగా అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అనంతరం అధికారిని అదుపులోకి తీసుకుని, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో వ్యవసాయ శాఖలో కలకలం రేగగా, దర్యాప్తు కొనసాగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి