Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 02:30 PM

ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అధికారి – రూ.20 వేలు స్వీకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అధికారి – రూ.20 వేలు స్వీకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అధికారి – రూ.20 వేలు స్వీకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
22-02-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరించి లంచం డిమాండ్

కంభం,: మార్కాపురం జిల్లా పరిధిలో లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కాడు.

మండలంలోని తురిమెళ్ళ గ్రామానికి చెందిన రవీంద్ర కుమార్ నిర్వహిస్తున్న ఎరువుల దుకాణ లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరిస్తూ, మండల వ్యవసాయ శాఖ అధికారి మొహమ్మద్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

దీనిపై బాధితుడు ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించగా, పక్కా ప్రణాళికతో వల పన్నారు. శుక్రవారం తన నివాసంలో బాధితుడి నుంచి రూ.20,000 లంచం స్వీకరిస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం అధికారిని అదుపులోకి తీసుకుని, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో వ్యవసాయ శాఖలో కలకలం రేగగా, దర్యాప్తు కొనసాగుతోంది.

Sthanikam

ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అధికారి – రూ.20 వేలు స్వీకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

Article Image

లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరించి లంచం డిమాండ్

కంభం,: మార్కాపురం జిల్లా పరిధిలో లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కాడు.

మండలంలోని తురిమెళ్ళ గ్రామానికి చెందిన రవీంద్ర కుమార్ నిర్వహిస్తున్న ఎరువుల దుకాణ లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరిస్తూ, మండల వ్యవసాయ శాఖ అధికారి మొహమ్మద్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

దీనిపై బాధితుడు ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించగా, పక్కా ప్రణాళికతో వల పన్నారు. శుక్రవారం తన నివాసంలో బాధితుడి నుంచి రూ.20,000 లంచం స్వీకరిస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం అధికారిని అదుపులోకి తీసుకుని, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో వ్యవసాయ శాఖలో కలకలం రేగగా, దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News