ఏర్కారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సామాజిక సమానత్వం, విద్యా ప్రాముఖ్యతపై ప్రసంగాలు చేశారు.
ఈ కార్యక్రమంలో 10వ వార్డు నెంబర్ బొర్రా సుధాకర్, గుండ్లపెల్లి శ్రీరాములు, మిద్దె ఇసాకు, బొర్రా అనిల్ కుమార్, బొర్రా రజిని, గంట సైదులు, పాల్వాయి జానయ్య, చింతలపాటి ప్రవీణ్, చింత శ్రీనివాస్, చింతలపాడు నవీన్, నర్ర పవన్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి