Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:00 PM

ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు హెచ్చరికలు

ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు హెచ్చరికలు

ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు హెచ్చరికలు
March 12, 2026 10:12 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. గరిష్ఠంగా కర్నూలు జిల్లాలో 37.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇది సాధారణ స్థాయితో పోలిస్తే సుమారు 3 డిగ్రీల మేర ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని, తగినంత నీరు తాగుతూ ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

వృద్ధులు, చిన్నపిల్లలు, కూలీలు ఎండలో ఎక్కువసేపు పనిచేయకుండా జాగ్రత్తలు పాటించాలని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News