Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:11 AM

ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు హెచ్చరికలు

ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు హెచ్చరికలు

ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు హెచ్చరికలు
March 12, 2026 10:12 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. గరిష్ఠంగా కర్నూలు జిల్లాలో 37.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇది సాధారణ స్థాయితో పోలిస్తే సుమారు 3 డిగ్రీల మేర ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని, తగినంత నీరు తాగుతూ ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

వృద్ధులు, చిన్నపిల్లలు, కూలీలు ఎండలో ఎక్కువసేపు పనిచేయకుండా జాగ్రత్తలు పాటించాలని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News