Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 14, 2026 09:21 AM

ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు హెచ్చరికలు

ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు హెచ్చరికలు

ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలకు హెచ్చరికలు
March 12, 2026 10:12 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. గరిష్ఠంగా కర్నూలు జిల్లాలో 37.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇది సాధారణ స్థాయితో పోలిస్తే సుమారు 3 డిగ్రీల మేర ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని, తగినంత నీరు తాగుతూ ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

వృద్ధులు, చిన్నపిల్లలు, కూలీలు ఎండలో ఎక్కువసేపు పనిచేయకుండా జాగ్రత్తలు పాటించాలని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News