Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 28, 2026 02:14 PM

ఏపీలో మేలో ఉపాధ్యాయ బదిలీలు… 20 వేల మందికి అవకాశం

ఏపీలో మేలో ఉపాధ్యాయ బదిలీలు… 20 వేల మందికి అవకాశం

ఏపీలో మేలో ఉపాధ్యాయ బదిలీలు… 20 వేల మందికి అవకాశం
February 28, 2026 12:36 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను మే నెలలో చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది సుమారు 20 వేల మంది టీచర్లు బదిలీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

బదిలీల్లో ఇవ్వబడే సర్వీస్ పాయింట్లు గత ఏడాది విధానంలోనే డెసిమల్ విధానంలో ఇవ్వనున్నట్లు సమాచారం. పారదర్శకత, సీనియారిటీ, కష్ట ప్రాంతాల్లో సేవలను పరిగణలోకి తీసుకుంటూ పాయింట్ల వ్యవస్థ కొనసాగించనున్నారు.

ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు శుక్రవారం మంగళగిరిలోని విద్యాభవన్‌లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బదిలీల విధానం, పాయింట్ల కేటాయింపు, ఖాళీల వివరాలు వంటి అంశాలపై చర్చించారు.

త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News