ఏపీలో 135 విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలు
ఏపీలో 135 విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలు
GADDAM JAGANMOHAN REDDY
అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల వెంట తొలి దశలో 135 విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వీటిలో మొత్తం 600 శక్తి నింపు యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రధానమంత్రి ఈ–డ్రైవ్ పథకం కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఏప్రిల్ నెలలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. ప్రణాళిక ప్రకారం జూలై–ఆగస్టు నాటికి ఈ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒక్కో కేంద్రం ఏర్పాటు చేయడానికి సుమారు రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల్లో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, భారీవాహనాలు వంటి అన్ని రకాల విద్యుత్ వాహనాలకు శక్తి నింపు సదుపాయం కల్పించనున్నారు.
రెండో దశలో విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో మరిన్ని విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి