Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:36 AM

ఏపీలో 135 విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలు

ఏపీలో 135 విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలు

ఏపీలో 135 విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలు
11-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల వెంట తొలి దశలో 135 విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వీటిలో మొత్తం 600 శక్తి నింపు యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ప్రధానమంత్రి ఈ–డ్రైవ్ పథకం కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఏప్రిల్ నెలలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. ప్రణాళిక ప్రకారం జూలై–ఆగస్టు నాటికి ఈ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒక్కో కేంద్రం ఏర్పాటు చేయడానికి సుమారు రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల్లో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, భారీవాహనాలు వంటి అన్ని రకాల విద్యుత్ వాహనాలకు శక్తి నింపు సదుపాయం కల్పించనున్నారు.

రెండో దశలో విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో మరిన్ని విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Sthanikam

ఏపీలో 135 విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలు

Article Image

అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల వెంట తొలి దశలో 135 విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వీటిలో మొత్తం 600 శక్తి నింపు యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ప్రధానమంత్రి ఈ–డ్రైవ్ పథకం కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఏప్రిల్ నెలలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. ప్రణాళిక ప్రకారం జూలై–ఆగస్టు నాటికి ఈ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒక్కో కేంద్రం ఏర్పాటు చేయడానికి సుమారు రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల్లో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, భారీవాహనాలు వంటి అన్ని రకాల విద్యుత్ వాహనాలకు శక్తి నింపు సదుపాయం కల్పించనున్నారు.

రెండో దశలో విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో మరిన్ని విద్యుత్ వాహనాల శక్తి నింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News