Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 09:32 AM

ఏపీ లో లస్కర్లకు శుభవార్త.. రోజువారీ వేతనం రూ.350 నుంచి రూ.550కు పెంపు

ఏపీ లో లస్కర్లకు శుభవార్త.. రోజువారీ వేతనం రూ.350 నుంచి రూ.550కు పెంపు

ఏపీ లో లస్కర్లకు శుభవార్త.. రోజువారీ వేతనం రూ.350 నుంచి రూ.550కు పెంపు
07-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖలో అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న లస్కర్లకు శుభవార్త ప్రకటించింది. వారి రోజువారీ వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ.350గా ఉన్న రోజువారీ వేతనాన్ని రూ.550కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

లస్కర్లు చాలా కాలంగా తమ వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వేతనాల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జలవనరుల శాఖ పరిధిలోని సీఏడీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పెంచిన వేతనాలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టి ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.

ఈ నిర్ణయంతో అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న లస్కర్లకు ఆర్థికంగా ఉపశమనం లభించనుంది. అలాగే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ఉద్యోగుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Sthanikam

ఏపీ లో లస్కర్లకు శుభవార్త.. రోజువారీ వేతనం రూ.350 నుంచి రూ.550కు పెంపు

Article Image

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖలో అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న లస్కర్లకు శుభవార్త ప్రకటించింది. వారి రోజువారీ వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ.350గా ఉన్న రోజువారీ వేతనాన్ని రూ.550కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

లస్కర్లు చాలా కాలంగా తమ వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వేతనాల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జలవనరుల శాఖ పరిధిలోని సీఏడీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పెంచిన వేతనాలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టి ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.

ఈ నిర్ణయంతో అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న లస్కర్లకు ఆర్థికంగా ఉపశమనం లభించనుంది. అలాగే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ఉద్యోగుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News