Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:05 PM

ఏపీ లో లస్కర్లకు శుభవార్త.. రోజువారీ వేతనం రూ.350 నుంచి రూ.550కు పెంపు

ఏపీ లో లస్కర్లకు శుభవార్త.. రోజువారీ వేతనం రూ.350 నుంచి రూ.550కు పెంపు

ఏపీ లో లస్కర్లకు శుభవార్త.. రోజువారీ వేతనం రూ.350 నుంచి రూ.550కు పెంపు
March 07, 2026 09:54 AM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖలో అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న లస్కర్లకు శుభవార్త ప్రకటించింది. వారి రోజువారీ వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ.350గా ఉన్న రోజువారీ వేతనాన్ని రూ.550కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

లస్కర్లు చాలా కాలంగా తమ వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వేతనాల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జలవనరుల శాఖ పరిధిలోని సీఏడీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పెంచిన వేతనాలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టి ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.

ఈ నిర్ణయంతో అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న లస్కర్లకు ఆర్థికంగా ఉపశమనం లభించనుంది. అలాగే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ఉద్యోగుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News