ఏపీ హైకోర్టులో నేడు జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించనున్న లీసా గిల్
ఏపీ హైకోర్టులో నేడు జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించనున్న లీసా గిల్
GADDAM JAGANMOHAN REDDY
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో ఉదయం 10.15 గంటలకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు.
పంజాబ్–హరియాణా ఉమ్మడి హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ లీసా గిల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెండో స్థానంలో కొనసాగనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం ప్రధాన న్యాయమూర్తుల నియామకంపై కీలక విధాన నిర్ణయం తీసుకుంది. చీఫ్ జస్టిస్ పదవికి ఖాళీ ఏర్పడే రెండు నెలల ముందే సంబంధిత హైకోర్టుకు న్యాయమూర్తిని బదిలీ చేయాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం మేరకు పంజాబ్–హరియానా హైకోర్టులో మూడో స్థానంలో ఉన్న జస్టిస్ లీసా గిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగా, దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి అనుమతి ఉండగా, జస్టిస్ లీసా గిల్ చేరికతో ప్రస్తుతం జడ్జీల సంఖ్య 34కు చేరనుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనుండగా, అనంతరం జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నిలవనున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి