Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

ఏపీ హైకోర్టులో నేడు జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించనున్న లీసా గిల్

ఏపీ హైకోర్టులో నేడు జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించనున్న లీసా గిల్

ఏపీ హైకోర్టులో నేడు జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించనున్న లీసా గిల్
March 13, 2026 11:21 AM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో ఉదయం 10.15 గంటలకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు.

పంజాబ్–హరియాణా ఉమ్మడి హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ లీసా గిల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెండో స్థానంలో కొనసాగనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం ప్రధాన న్యాయమూర్తుల నియామకంపై కీలక విధాన నిర్ణయం తీసుకుంది. చీఫ్ జస్టిస్ పదవికి ఖాళీ ఏర్పడే రెండు నెలల ముందే సంబంధిత హైకోర్టుకు న్యాయమూర్తిని బదిలీ చేయాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం మేరకు పంజాబ్–హరియానా హైకోర్టులో మూడో స్థానంలో ఉన్న జస్టిస్ లీసా గిల్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగా, దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి అనుమతి ఉండగా, జస్టిస్ లీసా గిల్ చేరికతో ప్రస్తుతం జడ్జీల సంఖ్య 34కు చేరనుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనుండగా, అనంతరం జస్టిస్ లీసా గిల్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె నిలవనున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News