Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:32 AM

ఏపీ అసెంబ్లీలో జైళ్ల సంస్కరణల బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ అసెంబ్లీలో జైళ్ల సంస్కరణల బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ అసెంబ్లీలో జైళ్ల సంస్కరణల బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
23-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఖైదీల క్షమాభిక్షపై హోంమంత్రి కీలక ప్రకటన

అమరావతి: బడ్జెట్ సమావేశాల ఎనిమిదో రోజున రాష్ట్ర జైళ్ల వ్యవస్థలో సమగ్ర మార్పులకు దారితీసే ‘జైళ్లు, సంస్కరణల చట్టం సవరణ బిల్లు’ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టిన ఈ బిల్లుతో జైళ్లను శిక్షాకేంద్రాలుగా కాకుండా సంస్కరణాలయాలుగా రూపాంతరం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

“శిక్ష కాదు... సంస్కరణే లక్ష్యం

సభలో మాట్లాడిన హోంమంత్రి అనిత, ఖైదీలలో మానసిక పరివర్తన తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. సత్ప్రవర్తన కనబరిచిన ఖైదీలకు క్షమాభిక్ష కల్పించే అంశంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన చట్టాల మేరకు రాష్ట్రంలోనూ సంస్కరణలు అమలు చేస్తామని తెలిపారు.

ఓపెన్ ఎయిర్ జైళ్లు – వృత్తి విద్యకు ప్రాధాన్యం

ఖైదీల నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజించి ‘ఓపెన్ ఎయిర్ జైళ్ల’ను అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి వెల్లడించారు. జైలు శిక్ష అనంతరం సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వ్యవసాయం, వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందించడంతో పాటు చదువు కొనసాగించేందుకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

వృద్ధ ఖైదీలకు ఉపశమనం?

60 ఏళ్లు దాటిన వృద్ధ ఖైదీలు, చిన్నచిన్న కేసుల్లో ఇరుక్కున్న వారికి సత్ప్రవర్తన ప్రాతిపదికన క్షమాభిక్ష ఇవ్వాలని సభలో సభ్యులు కోరారు. ఖైదీలు విడుదలైన తరువాత సమాజంలో తిరిగి కలిసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్రంలోని వందలాది మంది ఖైదీలకు విముక్తి దిశగా మార్గం సుగమం కానున్నది. జైళ్ల వ్యవస్థలో ఈ మార్పులు అమలులోకి వస్తే, ఖైదీల పునరావాసానికి ఇది మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

ఏపీ అసెంబ్లీలో జైళ్ల సంస్కరణల బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

Article Image

ఖైదీల క్షమాభిక్షపై హోంమంత్రి కీలక ప్రకటన

అమరావతి: బడ్జెట్ సమావేశాల ఎనిమిదో రోజున రాష్ట్ర జైళ్ల వ్యవస్థలో సమగ్ర మార్పులకు దారితీసే ‘జైళ్లు, సంస్కరణల చట్టం సవరణ బిల్లు’ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టిన ఈ బిల్లుతో జైళ్లను శిక్షాకేంద్రాలుగా కాకుండా సంస్కరణాలయాలుగా రూపాంతరం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

“శిక్ష కాదు... సంస్కరణే లక్ష్యం

సభలో మాట్లాడిన హోంమంత్రి అనిత, ఖైదీలలో మానసిక పరివర్తన తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. సత్ప్రవర్తన కనబరిచిన ఖైదీలకు క్షమాభిక్ష కల్పించే అంశంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన చట్టాల మేరకు రాష్ట్రంలోనూ సంస్కరణలు అమలు చేస్తామని తెలిపారు.

ఓపెన్ ఎయిర్ జైళ్లు – వృత్తి విద్యకు ప్రాధాన్యం

ఖైదీల నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజించి ‘ఓపెన్ ఎయిర్ జైళ్ల’ను అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి వెల్లడించారు. జైలు శిక్ష అనంతరం సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వ్యవసాయం, వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందించడంతో పాటు చదువు కొనసాగించేందుకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

వృద్ధ ఖైదీలకు ఉపశమనం?

60 ఏళ్లు దాటిన వృద్ధ ఖైదీలు, చిన్నచిన్న కేసుల్లో ఇరుక్కున్న వారికి సత్ప్రవర్తన ప్రాతిపదికన క్షమాభిక్ష ఇవ్వాలని సభలో సభ్యులు కోరారు. ఖైదీలు విడుదలైన తరువాత సమాజంలో తిరిగి కలిసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్రంలోని వందలాది మంది ఖైదీలకు విముక్తి దిశగా మార్గం సుగమం కానున్నది. జైళ్ల వ్యవస్థలో ఈ మార్పులు అమలులోకి వస్తే, ఖైదీల పునరావాసానికి ఇది మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News