ఈనాటి ఈ బంధం ఏనాటిదో..!
ఈనాటి ఈ బంధం ఏనాటిదో..!
Biksham Goud
పసిప్రాయంలో పెంచిన తల్లిని వెతుక్కొని కేరళకు చేరుకున్న సౌదీ యువకుడు
కేరళ:
పసిప్రాయంలో తనను కన్న తల్లి కన్నా మిన్నగా చూసుకుని అల్లారుముద్దుగా పెంచిన మహిళను వెతుక్కుంటూ సౌదీ అరేబియాకు చెందిన ఓ యువకుడు కేరళకు చేరుకున్నాడు. ప్రత్యేక విమానంలో భారత్కు వచ్చిన అతడు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రేమతో పెంచిన ఆ తల్లిని కలిసి భావోద్వేగానికి గురయ్యాడు. పొట్టకూటి కోసం సంవత్సరాల క్రితం సౌదీకి వెళ్లిన కేరళకు చెందిన ఓ హిందూ మహిళ అక్కడ ఓ షేక్ ఇంటిలో పని చేసింది. ఆ ఇంట్లో ఉన్న చిన్నారి బాలుడిని ఆమె సొంత కొడుకులా చూసుకుని పెంచింది. కాలక్రమేణా ఆమె స్వగ్రామానికి తిరిగి వచ్చేసింది. అయితే చిన్ననాటి ఆ మమకారాన్ని మరువలేని ఆ బాలుడు ఇప్పుడు పెద్ద యువకుడై తన పెంపుడు తల్లిని వెతుక్కుంటూ భారత్కు రావడం హృదయాలను కదిలించింది. తనను కన్న తల్లి కన్నా ఎక్కువ ప్రేమ చూపించినది ఈ అమ్మేనని, ఆమె ఎంతో గొప్పమనసున్న మహిళని యువకుడు భావోద్వేగంతో తెలిపాడు. వృద్ధురాలైన ఆమె కూడా తన వద్దకు వచ్చిన యువకుడిని సొంత కొడుకులా హత్తుకుని మురిసిపోయింది. ఆ క్షణాలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. ఆమె శేష జీవితానికి భరోసా కల్పించేలా తగు చర్యలు తీసుకుంటానని యువకుడు హామీ ఇచ్చాడు. మళ్లీ వస్తానమ్మా అంటూ ఆమెకు వీడ్కోలు పలికి సౌదీకి తిరుగు ప్రయాణం అయ్యాడు. మనుషుల మధ్య మమకారం, ప్రేమకు దేశాలు, మతాలు అడ్డుకావని ఈ సంఘటన మరోసారి చాటి చెప్పింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి