Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:33 PM

ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్‌దే

ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్‌దే

ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్‌దే
13-02-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రెండేళ్ల పాలనపై స్పష్టమైన ప్రజాతీర్పు – రికార్డు విజయానికి ప్రజలకు కృతజ్ఞతలు

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందన

హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం సాధించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల విశ్వాసం మరింత బలపడిందన్నారు.తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ఇందిరమ్మ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు అని మంత్రి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ మరియు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు వంటి ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయపథంలో సాగిందని గుర్తుచేశారు.

గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణ ప్రజలు కూడా ప్రభుత్వ పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నారని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రెండేళ్ల ప్రభుత్వ పనితీరుకు ప్రజాభిప్రాయ సేకరణగా భావిస్తున్నామని, ముందుగానే ప్రకటించినట్లుగానే ఫలితాలు వచ్చాయని తెలిపారు.పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడం వారి వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రతిపక్షాల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. ఎన్ని కుట్రలు జరిగినా ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన నిలిచి ముఖ్యమంత్రి నాయకత్వాన్ని మరింత బలపరిచారని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంపై అపార విశ్వాసం ఉంచి రికార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన తెలంగాణ ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలోనూ ఇదే ప్రజాతీర్పు పునరావృతమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Sthanikam

ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్‌దే

Article Image

రెండేళ్ల పాలనపై స్పష్టమైన ప్రజాతీర్పు – రికార్డు విజయానికి ప్రజలకు కృతజ్ఞతలు

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందన

హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం సాధించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల విశ్వాసం మరింత బలపడిందన్నారు.తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ఇందిరమ్మ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు అని మంత్రి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ మరియు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు వంటి ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయపథంలో సాగిందని గుర్తుచేశారు.

గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణ ప్రజలు కూడా ప్రభుత్వ పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నారని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రెండేళ్ల ప్రభుత్వ పనితీరుకు ప్రజాభిప్రాయ సేకరణగా భావిస్తున్నామని, ముందుగానే ప్రకటించినట్లుగానే ఫలితాలు వచ్చాయని తెలిపారు.పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడం వారి వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రతిపక్షాల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. ఎన్ని కుట్రలు జరిగినా ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన నిలిచి ముఖ్యమంత్రి నాయకత్వాన్ని మరింత బలపరిచారని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంపై అపార విశ్వాసం ఉంచి రికార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన తెలంగాణ ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలోనూ ఇదే ప్రజాతీర్పు పునరావృతమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News